కర్ణాటకనాట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేసి.. చివరకు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడిన వారిలో కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి డీకె శివకుమార్ శ్రమ ఎంతో వుంది. కాగా ఆయనపై తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. హవాలా ఆరోపణలతో పాటు, పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో శివకుమార్ సహా మరో ముగ్గురు వ్యక్తులపై ఈడీ ఈ మేరకు ఎఫ్ఐఆర్ ను నమోదైంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన చార్జీషీటును ఆధారంగా చేసుకుని ఈడీ ఈ కేసులు నమోదు చేసింది. ఈ ఎప్ఐఆర్ లో ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్య పేరు కూడా వుంది. శివకుమార్, అతని అనుచరులు ఎస్కే శర్మ హవాలా మార్గంలో లెక్కా పత్రం లేని డబ్బును తరలించారని ఆదాయ పన్ను శాఖ చార్జీషీటులో పేర్కొంది.
తన అనుచరుల సహాయంతో బెంగళూరు, ఢిల్లీల్లో శివకుమార్ ఓ నెట్వర్క్ ఏర్పరుచుకున్నారని, వీరి ద్వారానే హవాలా లావాదేవీలకు పాల్పడ్డారని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. శివకుమార్తో పాటు సచిన్ నారాయణ్, ఆంజనేయ హనుమంతయ్య, ఎన్.రాజేంద్రలపై కేసు నమోదైనట్టు చెప్పారు. సచిన్ నారాయణ్.. శివకుమార్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు.ఢిల్లీ కర్ణాటక భవన్లో ఉంటూ హనుమంతయ్య శివకుమార్ హవాలా ఆర్థిక లావాదేవీలకు సహకరించినట్టు ఆరోపణలున్నాయి. కర్ణాటక భవన్ పర్యవేక్షకుడిగా ఉన్న రాజేంద్ర కూడా శివకుమార్ అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు సహకరించాడని ఐటీ శాఖ ఆరోపిస్తోంది.
గత అగస్టులో ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో శివకుమార్కు చెందిన రూ.20కోట్ల లెక్కా పత్రం లేని డబ్బు పట్టుబడింది. అయితే శివకుమార్ మాత్రం ఐటీ శాఖ తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన బెయిల్ కూడా పొందారు. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. కాగా, గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గుజరాత్ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించి.. బీజేపీ గాలానికి అందకుండా చేయడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించడంతోనే కేంద్రం ఐటీ అధికారులను తనపైకి ఉసిగోల్పి కక్షపూరితంగానే కేసులు పెట్టించిందని అరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more