పోలీసులు అంటే కరుగ్గా ఉంటారనీ, సామాన్యులతో దురుసుగా ప్రవర్తిస్తారని చాలామంది సామాన్యులలో వున్న భావన. అయితే ఇలా కొందరు వ్యవహరించడంతోనే అందరూ అలానే వుంటారని అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. కానీ పోలీసులంటే అలానే కాదని మనవత్వం పరిమళించిన మహానుభావులు కూడా వుంటారని.. మరికొందరు పోలీసులు అప్పడప్పుడూ నిరూపిస్తూ.. వార్తల్లో వ్యక్తులుగా మారుతుంటారు.
ఇలాంటి ఓ పోలీస్ అధికారి ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సరికొత్త బాష్యం చెప్పాడు. తన చొరవతో నిండు గర్భిణిని అస్పత్రిలో చేర్పించాడు. తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాడు. అదెలా అంటే.. ఉత్తర్ ప్రదేశ్ ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ లో సోనూకుమార్ రాజోరా పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గఢ్ గ్రామానికి చెందిన మహేశ్ తన భార్య భావన కాన్పు చేయించడం కోసం రైలులో బయలుదేరారు. రైలు మధుర కంటోన్మెంట్ వద్దకు చేరుకోగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.
దీంతో స్టేషన్ లో దిగిపోయిన మహేశ్ సాయం చేయాలని పలువురిని అర్థించాడు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీస్ అధికారి సోనూకుమార్ వద్దకు వెళ్లాడు. వెంటనే స్పందించిన సోనూ కుమార్ అక్కడకు వచ్చి అంబులెన్సుకు ఫోన్ చేశాడు. వాహనం అందుబాటులో లేదని జవాబు రావడంతో భావనను చేతులతో ఎత్తుకుని 100 మీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించడంతో భావన పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్యం స్థిరంగా ఉంది. కాగా సోనూకుమార్ కు ఈ సందర్భంగా మహేశ్-భావన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయమై సోనూకుమర్ మాట్లాడుతూ.. ‘నేను నా విధిని మాత్రమే నిర్వర్తించాను. అంబులెన్సు లేకపోవడంతో ఆమెను ఆసుపత్రి వరకూ మోసుకెళ్లాను’ అని సోనూకుమార్ తెలిపారు. కాగా, ఓ పోలీస్ అధికారిగా సోనూకుమార్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more