తెలంగాణ ముందస్తు ఎన్నికలకు బీజేపి కూడా సమరశంఖం పూరించింది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్ర పర్యటను వచ్చిన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని పలు విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీతో పోత్తు పెట్టుకుంటామన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. టీఆర్ఎస్ తో పోత్తు వుండబోదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. తెలంగాణలోని అన్ని స్థానాల్లో తాము బరిలో నిలుస్తామని చెప్పారు.
ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనేది తమ నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నినాదమని ఉటంకించారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలం అయ్యారని అమిత్ షా విమర్శించారు. తాము ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటామన్న షా.. తమకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రత్యర్థులేనని అన్నారు.
‘జమిలీ ఎన్నికలను ముందుగా సమర్థించిన కేసీఆర్.. ఇప్పుడు రెండు సార్లు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రజలపై కోట్ల రూపాయల భారం ఎందుకు మోపుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది తన తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కాదా.? అని నిలదీశారు. ఇది అవకాశవాద రాజకీయం కాదా కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతిలో పెట్టాలనుకుంటున్నారా? అని ఆయన నిలదీశారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. కేసీఆర్ పాలన చూస్తుంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనుకోవడం లేదని అన్నారు. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?. 2014లో దళితుడే సీఎం అన్న కేసీఆర్ మాట ఏమైంది?. 2018లో అయినా దళిత సీఎం హామీ నిలబెట్టుకుంటారా? అంటూ కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ విషయంలోనూ కేసీఆర్ విఫలం అయ్యారు.
ఇక ప్రగతి భవన్ నుంచే పాలన నడిపిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు పుట్టల్లో స్థానం సంపాదించారని వ్యంగవ్యాఖ్యలు సంధించారు. మూఢ నమ్మకాలతో సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆర్ ఒక్కరే. అలా చేయడం సబబేనా?. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను ప్రపంచస్థాయికి చేరుస్తామన్న హామీ ఏమైంది? టీఆర్ఎస్ పాలనలో 4,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. పంటకు మద్దతు ధర అడిగిన రైతులను ఖమ్మంలో అరెస్ట్ చేయించారు. అలాగే ఇసుక మాఫియా ప్రశ్నిస్తే నేరెళ్లలో దళితుల్ని వేధించారు’ అని అమిత్ షా మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more