దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢి్ల్లీ బురారీ ప్రాంతంలోని సామూహిక ఆత్మహత్యల కేసులో.. మరో ట్వీస్లు ఏర్పడింది. కుటుంబసభ్యులందరూ సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారని భావించినా అది వాస్తవం కాదని తాజాగా వెల్లడైంది. మోక్షం పొందడం కోసమే కుటంబసభ్యులందరూ సామూహికంగా ఆత్మహత్య పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు భావించినా.. ఈ కేసును సీబిఐ చేతికి వెళ్లిన నేపథ్యంలో వారిది ఆత్మహత్య కాదని, అయితే వారందరూ బలవన్మరణానికి పాల్పడ్డారని స్పష్టమైంది.
అయితే కుటుంబంలోని ఓ వ్యక్తి మిగతా వారిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ద్వారా తెలిసింది. అయితే ఆ 11 మంది బలవన్మరణానికి మోక్షం కోసం చేసిన క్రతువులో జరిగిన అపశృతే వారందరి ప్రాణాలను బలిగొందని సైకలాజికల్ ఆటాప్సీ నివేదికలో పేర్కొన్నారు. క్రతువులో భాగంగానే కుటుంబసభ్యులందరూ ఉరివేసుకున్నారని, మృతుల్లో ఏ ఒక్కరికీ చనిపోవాలన్న ఉద్దేశం లేదని నివేదిక పేర్కొంది. మృతుల ఇంట్లో లభించిన డైరీలు, స్నేహితులు, బంధువులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ నివేదికను తయారుచేశారు.
బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటనతో దేశరాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్ దేవీ(77), ఆమె 10 మంది కుటుంబసభ్యులు జులై 1న విగతజీవులుగా కన్పించారు. 10 మంది మృతదేహాలు ఇంటి పైకప్పునకు వేలాడుతూ ఉండగా.. నారాయణ్ దేవీ మృతదేహం మరో గదిలో కిందపడి ఉంది. మృతుల కళ్లకు గంతలు, చేతులు వెనక్కి కట్టి ఉండటాన్ని చూసి తొలుత పోలీసులు సామూహిక హత్యగా భావించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more