Honour killing in warangal of telangana ‘కులాంతరం’పై కత్తిగట్టిన పెద్దలు.. పరువు హత్య..

Man stabbed to death in suspected honour killing in nalgonda

nalgonda honour killing,telangana honour killing,Telangana,nalgonda stabbing,nalgonda news,Nalgonda Murder,nalgonda,honour killing, honour killing, Inter-caste Marriage, miryalaguda, Nalgonda, telangana, crime

In a suspected case of honour killing, a newly married man was stabbed to death in front of his wife outside a hospital in Miryalaguda town of Nalgonda district. The incident created tension in the town.

ITEMVIDEOS: ‘కులాంతరం’పై కత్తిగట్టిన పెద్దలు.. పరువు హత్య..

Posted: 09/14/2018 08:52 PM IST
Man stabbed to death in suspected honour killing in nalgonda

నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో దారుణం జరగింది. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో, ఇటు తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే పరువు హత్యలు తెలంగాణలోనూ చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య కలకలం రేపింది. అమ్మాయి తండ్రే కాలయముడై తన కూతురు పసుపు కుంకుమలను తుడచేశాడు. ఓ కిరాయి హంతకుడితో అల్లుడి హత్యకు డీల్ మాట్లాడి మట్టుబెట్టాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

తొలుత ఈ హత్య ఘటనలో అమ్మాయి తండ్రి పాత్రను అప్పుడే నిర్థారించలేమని చెప్పిన పోలీసులు తరువాత యువతి తండ్రే ఏ1 నిందితుడని పేర్కోన్నారు. ఏ2గా యువతి బాబాయ్ శ్రావణ్ ను పేర్కోన్నారు. వీరు పరారీలో వున్నారని తెలుసుకున్న పోలీసులు వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇక పోలీసుల ఈ కేసును దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో యువకుడిని హతమార్చేందుకు గత మూడు నెలలుగా కుట్ర జరుగుతుందని కూడా తేల్చారు.

యువకుడిని హత్య చేయడానికి 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారని కూడా తెలుసుకున్నారు. యువకుడ్ని హతమార్చిన దుండగుడి సంబంధించిన కీలక అధారాలను సేకరించారు పోలీసులు. నిందితుడు ఎడమకాలు కుంటుతున్నాడని గుర్తించారు. గతంలో యువకుడికి ప్రాణభయం వుందని అతని తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువతి తండ్రిని ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. కాగా హత్య జరిగిన తరువాత నుంచి అమ్మాయి తండ్రి, బాబాయ్ లు పరారీలో వున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ అనే వ్యక్తి 6 నెలల క్రితం అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఆసుపత్రికి వచ్చి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ప్రణయ్ మెడపై బలంగా దాడి చేశాడు. దీంతో కత్తి పోటుకు ప్రణయ్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చి వెళుతుండగా గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు.  ప్రణయ్ ఆరు నెలల కిందట బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారే ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడు ఒక్క దెబ్బకే ప్రణయ్ ని చంపేశాడు. చాలా పదునైన కత్తితో దాడి చేయడంతో ప్రణయ్ మెడభాగం అంతా నుజ్జునుజ్జయింది. ప్రణయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఈ ఘటనతో మిర్యాలగూడలో అసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రణయ్ హత్య అనంతరం అమృత అసుపత్రిలో సృహకోల్పోయింది. అమెకు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు వైద్యులు. అయితే అమె భర్త ప్రణయ్ చనిపోయిన విషయం ఇంకా అమెకు తెలియదని బందువులు చెప్పారు. కాగా అస్పత్రి వద్ద దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. అయితే పోలీసుల మాత్రం ఇలాంటి పరిణామాలను ముందుగానే ఊహించి ప్రణయ్ అమృతలను వేరే ప్రాంతానికి వెళ్లమని కోరామని, అయితే అందుకు ఇద్దరు ఒప్పుకోకుండా ఇక్కడే వుంటామని చెప్పారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honour killing  Inter-caste Marriage  miryalaguda  Nalgonda  telangana  crime  

Other Articles