తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అడపాదడపా అర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా ఇంత పెద్ద సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపిన ఘటన మాత్రం ఇదే. జగిత్యాలకు చేరువలోని కొండగట్టులో వున్న అంజనేయస్వామి దేవాలయానికి భక్తులతో కిక్కిరిసి వెళ్తున్న ఆర్టీసి బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య యాభై నాలుగుకు చేరింది.
కొద్దిసేపటి క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి క్షతగాత్రుడైన బస్సు డ్రైవర్ శ్రీనివాస్ అసుప్రతిలో చికిత్స పోందుతూ మృతిచెందాడు. దీంతో బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 54కు చేరింది. ప్రమాద మృతుల్లో నలుగురు చిన్నారులతో పాటు 32 మంది మహిళలు, 15 మంది పురుషులు వున్నారు. క్షతగాత్రులైన వారిని స్థానిక జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిని వారిని హైదరాబాద్, కరీంనగర్ అసుపత్రులకు కూడా తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 85 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తుంది. ప్రమాదం తీవ్రస్థాయిలో వుందని తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. స్థానిక అసుపత్రులలో చికిత్స పోందుతున్న బాధితులను మంత్రులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.
ఇదిలావుండగా బస్సు ప్రమాదానికి కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సులను అనుమతించే దారి నుంచి కాకుండా షార్ట్ కట్ రూట్ అయిన ఘాట్ రోడ్డులోంచి వెళ్లడం కారణమని భావిస్తున్నారు. ఇక బస్సును గేర్ లో కాకుండా న్యూట్రల్ గేర్ లో కిందకు తీసుకురాడం.. అదే సమయంలో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ వద్ద కూడా బ్రేకులు వినియోగించకపోవడం.. దాంతో బస్సు పైకి ఎగరి పటడం.. బస్సులు అధిక సంఖ్యలో ప్రయాణికులు వుండటం వల్ల బస్సు ఎగిరి పక్కకు జారిందని.. అదే సమయంలో బస్సు రోడ్డుకు అడ్డుగా వున్న రేయిలింగ్ ను చీల్చుకుంటూ లోయలోకి పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే బస్సు ప్రమాదంపై డ్రైవర్ శ్రీనివాస్ కుటింబికులు, బంధువుల వాదన మరోలా వుంది. బస్సుకు ఫిట్ నెస్ లేదని, అందుచేత తాను ఇవాళ విధులకు హాజరుకానని డ్రైవర్ శ్రీనివాస్ విధులకు హాజరయ్యేందుకు కూడా మారం చేశాడని వారు తెలిపారు. అయితే.. డీఎం తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సిందేనంటూ అదేశాలు జారీ చేయడంతోనే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరయ్యాడని శ్రీనివాస్ కుటింబికులు తెలిపారు. అయితే ప్రమాదం సంభవించిన క్రమంలో ఇప్పుడు అధికారులు మాటమారుస్తున్నారని వారు అరోపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more