కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏఈ అభివృద్దిలో భాగమైన లక్షలాధి మంది భారతీయులు మరీ ముఖ్యంగా వేలాది మంది కేరళవాసులు ఎన్నో ఏళ్లుగా ఏమిరేట్స్ అభ్యున్నతికి పాటుపాటుపడ్డారు. దీంతో కేరళ రాష్ట్రాన్ని ఆదుకుంటామని గతంలోనే ప్రకటించిన యూఏఈని భారీ సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది.
యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు బిన్ రషీద్ మక్తూమ్.. తాజాగా తమ దేశం తరఫున ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారు. యూఏఈ ఓ దేశంగా విజయం సాధించడంలో కేరళ ప్రజల భాగస్వామ్యం మరచిపోలేమని ఆయన గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేరళకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా జాతీయ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మక్తూమ్ ప్రకటించారు.
యూఏఈ రూ.700 కోట్ల విలువైన సాయాన్ని ప్రకటించిన విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. తమపై ఎంతో ప్రేమ చూపిన యూఏఈ ప్రభుత్వానికి, పాలకులకు విజయన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కేరళ వరదలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ మొత్తం రూ.600 కోట్ల సాయం మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చించేందుకు అఖిల పక్షం ఈ రోజు సాయంత్రం తిరువనంతపురంలో భేటీ కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more