ఓ వైపు భారీ వర్షాలతో కేరళ అల్లాడుతుంటే.. అపదలో చిక్కుకున్న ఆర్తులను అదుకునేందుకు వారిని సురక్షితంగా సహాయ శిబిరాలకు చేర్చేందకు అపన్నహస్తం అందిస్తూ.. ముందుకు సాగుతున్న రియల్ హీరోస్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపేమో కొందరు దుండగులు విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్లు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా భారత ఆర్మీ యూనిఫాం ధరించిన ఓ యువకుడు కేరళ ప్రజలను తూలనాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘భారతీయ మహిళా మోర్చా తలస్సేరి’ అనే ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి సైనిక దుస్తులు ధరించి మాట్లాడుతూ.. ‘భారత సైన్యంపై మీకు (కేరళ ప్రజలకు) ఎందుకంత ద్వేషం? మేం కేరళకు రావడం మీ మంత్రి కొడియారి బాలకృష్ణన్ కు ఇష్టం లేదా? చెంగన్నూర్ లో వేలాది మంది చిక్కుకుపోయారు. మమ్మల్ని మా పని చేయనివ్వండి. మేము మీ రాష్ట్రాన్ని ఆక్రమించుకోము. భయపడకండి’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
ఈ వీడియో వైరల్ గా మారడంతో భారత ఆర్మీ వెంటనే స్పందించింది. కేరళలో ఆర్మీ చేపడుతున్న సహాయ కార్యకలాపాలపై ఓ మోసగాడు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ట్వీట్ చేసింది. ఈ ఘటన వెనుక ఉన్నవారు ఎవరో తెలిస్తే వెంటనే తమ నంబర్ 917290028579 కి వారి వివరాలను వాట్సాప్ చేయాలని సూచించింది. ప్రస్తుతం జవాన్లు కేరళలో సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించింది
Imposter wearing Army combat uniform in video spreading disinformation about rescue & relief efforts. Every effort by all & #IndianArmy aimed to overcome this terrifying human tragedy.Forward disinformation about #IndianArmy on WhatsApp +917290028579. We are at it #KeralaFloods pic.twitter.com/ncUR7tCkZW
— ADG PI - INDIAN ARMY (@adgpi) August 19, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more