ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్, నోబెల్ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫి అన్నన్ (80) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం తీవ్రఅస్వస్థతకు గురైన ఆయనను స్విట్జర్లాండ్ లోని అసుపత్రికి తరలించగా, చికిత్స పోందుతూ ఆయన తరలిరానీ లోకాలకు వెళ్లారని.. యూఎన్ మైగ్రేషన్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కోఫి అన్నన్ ఫౌండేషన్ ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చివరి రోజుల్లో భార్య నానే, పిల్లలు అమా, కోజో, నినా ఆయనతోనే ఉన్నారని తెలిపుతూ.. ఈ మేరకు ట్విట్టర్లో భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది.
ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రస్థానం వివిధ స్థాయుల నుంచి సెక్రటరీ జనరల్ స్ధాయి వరకూ సాగింది. సెక్రటరీ జనరల్గా 1997 నుంచి 2006 వరకు కోఫి అన్నన్ విధులు నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2001లో నోబెల్ శాంతి బహుమతి ఆయనను వరించింది. గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐరాస వలసల విభాగం ట్విటర్ ద్వారా అన్నన్ కు నివాళులర్పించింది. ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు ఏకంగా పదేళ్ల పాటు పదవిలో కొనసాగారు.
ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రపంచ శాంతి కోసం ఎంతగానో కృషి చేశారు. సమగ్రాభివృద్ధి, మానవ హక్కుల కోసం కూడా ఆయన పాటుపడ్డారు. ఐరాస నుంచి తప్పుకొన్న తర్వాత కూడా కోఫీ అన్నన్ ఫౌండేషన్ ఛైర్మన్గా, నెల్సన్ మండేలా స్థాపించిన ది ఎల్డర్స్ గ్రూప్లో సభ్యుడిగా ప్రపంచ శాంతి కోసం తన వంతు కృషి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more