కవిగా, మానవతావాదిగా, అంతకుమించి నిష్కళంకుడైన రాజకీయ నేతగా, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మాజీ ప్రధాని, కమలదళ బీష్ముడు, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి అంతిమ సంస్కారాల రోజున.. అక్కడకు జనసమూహం అధికంగా వున్నా.. వారందరినీ దాటుకుంటూ బీజేపి కేంద్ర కార్యాలయం వద్దకు చేరకున్న సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై కొందరు గుర్తు తెలియని అగంతకులు దాడికి పాల్పడ్డారు. ఆయన దారిని అడ్డుకుని మరీ వెనక్కి తొసుకుంటూ తీసుకువచ్చారు. ఆయన తలపాగా కూడా లాగి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు.
బీజేపి కేంద్ర కార్యాలయంలో ఉంచిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పార్థీవ దేహానికి ఆయన తన నివాళులర్పించేందుకు నడుచుకుంటూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో వస్తుండగా, వెనుకగా వచ్చిన కొందరు గుర్తు తెలియని అగంతకులు ఆయనపై దాడి చేశారు. తనపై దాడి తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన తాను మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళులు అర్పించేందుకు బీజేపి ఆఫీస్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నానని.. ఈ క్రమంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తనపై దాడి చేశారన్నారు. దారుణంగా కొట్టారని, అసభ్యకరంగా దూషిస్తూ.. తన తలపాగాను లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్నివేష్ దేశద్రోహి అంటూ తనను చితకబాదినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కావాలనే స్వామి అగ్నివేష్ పై దాడి చేయించారని మండిపడుతున్నారు బీజేపి కార్యకర్తలు. దీంతో కాసేపు ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి, క్లీయర్ చేశారు. దాడి చేసినవారిని ఎలాగైనా పట్టుకుంటామని తెలిపారు పోలీసులు. కాగా, స్వామి అగ్నివేష్ పై దాడి జరగడం నెల రోజుల్లోనే ఇది రెండోసారి. జార్ఖండ్ లో కొద్ది రోజుల క్రితం బీజేపి కార్యకర్తలు స్వామి అగ్నివేష్ పై దాడి చేసిన విషయం తెలిసిందే.
#Video : Swami Agnivesh attacked outside BJP office while going to pay respect to the former PM.#AtaljiAmarRahen pic.twitter.com/vg8pZRITJx
— NBT Dilli (@NBTDilli) August 17, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more