పది పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. నిత్యం ప్రజల్లో వుంటూ.. వారిని చైతన్యపరుస్తూ వుండేవారన్న విషయం తెలిసిందే. జనసంఘ్ పార్టీని స్థాపించి ఆనంతరం అద్వానీతో కలసి భారతీయ జనతా పార్టీని స్థాపించిన ఆయన.. రెండు స్థానాలతో పార్లమెంటులో అడుగుపెట్టి.. అక్కడి నుంచి ఏకంగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వరకు పోరాడారంటే ఆయన ప్రసంగాలతో ప్రజలు ఎలా సమ్మెహనులయ్యేవాళ్లో.. ఆయన వాగ్ధాటికి ఎలా అప్పటి యువతరం ఉప్పోంగిపోయేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అయితే అలాంటి ప్రధానిలో తాను సామాన్య ప్రజలకు దూరం కానున్నానని, తన చుట్టూ ఓ వలయం నిర్మితం కానుందని తెలిసిన తరువాత భావోద్వేగానికి గురై కంట కన్నీరు పెట్టుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో మాజీ జర్నలిస్టు, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా అడిగిన ప్రశ్న విని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజీవ్ శుక్లా స్వయంగా గుర్తు చేసుకుంటూ, "నేను వాజ్ పేయిని 1996లో ఇంటర్వ్యూ చేశాను. ఆయన ప్రధాని కాబోతున్న వేళ ఇది జరిగింది. మీరు ప్రధాని కాబోతున్నారు. రేపటి నుంచి మీ చుట్టూ భద్రతా వలయం ఏర్పడుతుంది. మీరు ఇక ప్రజలను దూరం నుంచి కలవాల్సిందే.... అని అంటుండగా, ఆయన ఏడుపు ప్రారంభించారు. తనకు ప్రజలు దూరమవుతారన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపించింది" అని అన్నారు.
ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు కూడా సౌకర్యవంతంగా కనిపించేవని, కక్షపూరిత చర్యలకు ఆయన వ్యతిరేకమని, అందువల్లే ఆయనంటే ఎంతో మందికి ప్రేమని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. సమకాలీన రాజకీయ నేతలతో పోలిస్తే, ఆయన ఆలోచనా ధోరణి విభిన్నమైనదని చెప్పారు. నేటి తరం నేతలు ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాల్సివుందని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాల్లోని మంచి లక్షణాలను అందిపుచ్చుకుని ఎదిగిన వాజ్ పేయి, గొప్ప వక్తని కొనియాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more