పెద్ద నోట్ల రద్దు పేరుతో అప్పటి వరకు చెలామణిలో వున్న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అప్పటి వరకు వున్న వెయ్యి నోటుకు వందశాతం అధికమైన రూ. రెండు వేల నోటును చలామణిలోకి తీసుకువచ్చింది. అయితే ఈ నోటును చలామణిలోకి తీసుకురావడంతో ముందుగా చిల్లర సమస్య ఉత్పన్నమైంది. ఆ తరువాత రూ. 2 వేల నోటు కనినించడమే కష్టమైంది. దీంతో దేశ ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ నోటును కూడా ప్రభుత్వం ఉపసంహరిస్తుందన్న పుకార్లు వినిపించాయి.
దీంతో రూ. 2 వేల నోట్లు వున్నా.. వంద రూపాయలు వున్నావాడే ధనవంతుడని భావించిన రోజులను కూడా దేశప్రజలు వీక్షించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షానికి చెందిన సభ్యులు ప్రభుత్వం రెండు వేల నోట్లను ఉపసంహరించుకోనుందా.? అంటూ నేరుగా పార్లమెంటులోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దీనిపై బదులిస్తూ కేంద్రం అలాంటిదేమీ లేదని గతంలోనే స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న క్రమంలో మరోమారు ఎంపీలకు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో మరోమారు సభ్యులు లోక్ సభలో ప్రశ్నించారు.
అయితే రెండు వేల రూపాయల నోటుపై వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం మరోమారు స్పష్టత ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం లోక్సభలో మాట్లాడుతూ.. రూ.2 వేల నోటును ఉపసంహరించుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఈ నోటును ఉపసంహరించుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. దేశంలో పెరిగిపోతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more