తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఢీఎంకే అధినేత, కళైంజ్ఞర్ కరుణానిధికి పలువరు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చెన్నైలోని రాజాజీ హాలు వద్దకు వచ్చిన ప్రధాని మోడీ.. కరుణానిధి పార్థివదేహాం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అంతకు ముందు ఉదయం 10.38 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మరికొందరు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.
కరుణానిధి మరణవార్త తెలిసిన వెంటనే చెన్నైకి చేరుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆయన పార్థివ దేహాన్నిసందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా నివాళులర్పించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన చాంధీ.. సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్, సీపీఐ నేత రాజా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సహా పలువురు నేతలు కరుణానిధికి పార్థీవదేహాన్ని దర్శించి తమ నివాళులు అర్పించారు.
అటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కరుణానిధి పార్థివదేహానికి నివాళులర్పించారు. సినీనటుడి నుంచి రాజకీయ వేత్తగా మారిన తమిళనటుడు కమల్ హాసన్ కూడా కరుణానిధి బౌతికఖాయానికి దర్శించి అంజలి ఘటించారు. మరో సినీనటుడు అజిత్ కూడా షూటింగ్ రద్దు చేసుకుని చెన్నైకి పయనమయ్యారు. మరోవైపు ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నేతలు చెన్నై చేరుకోనున్నారు.
కాగా, సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజాజీ హాలు నుంచి కలైంజ్ఞర్ కరుణానిధి బౌతికఖాయానికి అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. మద్రాసు హైకోర్టు మెరినా బీచ్ లో అంత్యక్రియలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లు అన్నింటినీ కొట్టివేస్తూ.. కరుణానిధి పార్థీవదేహానికి అంత్యక్రియలను మెరినా బీచ్ లో నిర్వహించేందుకు అనుమతిని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4.30 గంటలకు రాజాజీ హాలు నుంచి మెరినా బీచ్ వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
#WATCH: PM Narendra Modi talks to DMK leaders MK Stalin & Kanimozhi, after paying last respects to M #Karunanidhi at #RajajiHall in Chennai. pic.twitter.com/cEiwjEdNbz
— ANI (@ANI) August 8, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more