విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరహాలో బ్యాంకులకు టోపీ వేశాడు మహారాష్ట్రలో ఒక బడాబాబు. పేరుకు పారిశ్రామిక వేత్తే అయినా.. రైతు రక్తాన్ని పిల్చే జలగ మాదిరిగా తయారైయ్యాడు. రైతుల భూములకు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి.. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసి వేల కోట్ల రూపాయలను దండుకున్నాడు. ఇంతకీ ఆ పారిశ్రామికవేత్త ఎవరని అంటారా.? అతనే రత్నాకర్ గుత్తే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. రూ. 5,400 కోట్ల రుణాలను రైతుల పేరు మీద తీసుకున్నాడు ఈ బుట్టాచోర్.
అప్పు చేసి దానిని కట్టేందుకు పూట తిండి కూడా మానేవేసే సామాన్య రైతులు బ్యాంకులకు వెళ్తే చీదరించుకున్నట్టు చూసే బ్యాంకు యాజమాన్యాలు.. నకిలీ పత్రాలను సృష్టించిన ఘనుడికి మాత్రం ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా అడిగిన వెంటనే కాదనకుండా క్యూ కట్టి మరీ అప్పులను ఇచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర శాసన మండలిలో విపక్ష నేత ధనంజయ్ ముండే వెల్లడించారు. నకిలీ పత్రాలు చూపించి అతను భారీగా వ్యవసాయ రుణాలు పొందాడని ఆయన ఆరోపించారు. పీఎన్బీ కుంభకోణంలో నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తరహాలో రత్నాకర్ దేశం విడిచి పారిపోకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి అతనిని చట్టం ముందుకు తీసుకు రావాలని ముండే డిమాండ్ చేశారు.
పర్భనీ జిల్లాలోని గంగాఖేడ్ షుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ప్రమోటర్ అయిన రత్నాకర్ గుత్తే రైతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి వివిధ బ్యాంకుల నుంచి రూ.5,400 కోట్ల మేర రుణాలు తీసుకున్నాడు. ఆ డబ్బును వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించాడు. ఇందుకోసం గుత్తే 22 షెల్ కంపెనీలు ప్రారంభించాడని ముండే ఆరోపించారు. 2015లో గంగాఖేడ్ షుగర్ ఫ్యాక్టరీ 600కి పైగా రైతుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొంది. ఆ అప్పులు కట్టాలని రైతులకు బ్యాంకులు నోటీసులు పంపించాయి. అందులో కొందరికి రూ.25 లక్షలు చెల్లించాలని తాఖీదులు రావడంతో ఆ రైతులు షాకయ్యారు.
గంగాఖేడ్ షుగర్ ఫ్యాక్టరీ అండ్ ఎనర్జీ లిమిటెడ్ గ్రూప్ లోని పలు కంపెనీలు షెల్ కంపెనీలేనని ముండే తెలిపారు. జూలై 5న రత్నాకర్ గుత్తేపై ఐపీసీ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ ఇప్పటి వరకు అతనిని అరెస్ట్ చేయలేదని ధనంజయ్ ముండే చెప్పారు. ఈ వ్యవహారంలో జాప్యం ఎంత మాత్రం పనికి రాదని.. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే గుత్తే కూడా నీరవ్ మోడీ తరహాలో తప్పించుకొని విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more