దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై బధిర బాలిక రేప్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 11 ఏళ్ల బధిర బాలికపై మొత్తం 24 మంది నిందితులు గత అరు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న విషయం బయటపడి సంచలనం కాగా, అందులో 17 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి మహిళా న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితులను చూసి వారు చేసిన దారుణ ఘటనలు విని చెల్లించిపోయిన న్యాయవాదులు.. వారిని న్యాయస్థానం అవరణలోనే కిందపడేసి మరీ దాడిచేసి బుద్దిచెప్పారు.
సమయానికి పోలీసులు రాకపోయి వుండివుంటే.. నిందితుల్లో కొందరు దెబ్బలు తాళలేక అసువులు బాసివుండేవారన్న వార్తలు కూడా వచ్చాయి. కాగా ఇప్పుడీ కేసులో మరో నిర్ఘాంత పరిచే ఘటన వెలుగుచూసింది. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సెక్యూరిటీ గార్డులు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, లిఫ్ట్ ఆపరేటర్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. బాలికపై తాతయ్య వయస్సున్న 66 ఏళ్ల వ్యక్తి.. స్థానికంగా లిప్ట్ అపరేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిందితుడు బాలికను తొలుత అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
బాలిక స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం చుట్టూ సైకిల్ తొక్కుతుండగా.. బాలికను తన మాటలతో మభ్యపెట్టిన వృద్దుడు.. తన మనమరాలి వయస్సున్న బాలిక అన్న కనీసం ఇంకితం లేకుండా.. చిన్నారిపై పైశాచిక మృగంలా పడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన నేరం ఎప్పటికీ బయటపడకుండా అలోచన చేసిన నిందితుడు.. తనకు పరిచయం వున్న సెక్యూరిటీ గార్డులు, భవన నిర్మాణంలో పనిచేస్తున్న పరిచయస్థులైన ప్లంబర్లను బాలిపై అత్యాచారానికి పురిగొల్పాడు.
తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాలికపై అత్యాచారానికి పాల్పడిన తరువాత మిగతా వారిని లిఫ్ట్ ఆపరేటర్ తన పరిచయస్థులను ఉసిగొల్పాడని, వారు బాలికపై అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారని పోలీసులు వివరించారు. బాధిత బాలిక నిందితులందరినీ గుర్తించిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు నేరాన్ని అంగీకరించారని, ఇద్దరు మాత్రం తాము లైంగిక వేధింపులకు గురిచేశామని అంగీకరించినట్టు పేర్కొన్నారు. కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, పరారీలో వున్న మరో ఏడుగురు నిందితులు కూడా ఈ అత్యాచార ఘటనలో వున్నారా లేదా.? అన్నది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. ఇక వారు కూడా తమ సెల్ ఫోన్లలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను తీశారా.? లేదా.? అన్నది ఇప్పుడే తెలియదని చెప్పారు. ఇదిలావుండగా, మద్రాసు హైకోర్టు న్యాయవాదులు అసోసియేషన్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుల తరపున తమ సభ్యులెవ్వరూ వాదించరని అసోసియేషన్ అధ్యక్షుడు మోహనకృష్ణన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more