రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులను తీసుకువచ్చేలా జనసైనికులు నిత్యం కృషి చేయాలని పవన్ కల్యాన్ తన సైనకు పిలుపునిచ్చారు. సామాజక రాజకీయ వ్యవస్థను బాద్యాతయుతంగా మలిచడంలో జనసైనికులు తోడ్పాటు అత్యంత అవసరమని ఆయన అన్నారు. ఇలాంటి వ్యవస్థ మన తెలుగు రాష్ట్రాలలో రావాలని కాంక్షిస్తూ.. ఆ దిశగా అడుగులు వేస్తున్న జనసేన తమ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు జనసేన ఐటీ, నాలెడ్జ్ హబ్ దోహదం చేస్తాయని ఆయన పవన్ కల్యాన్ అన్నారు.
హైదరాబాద్ రాయదుర్గంలో జనసేన ఐటీ సెంటర్ తో పాటు నాలెడ్జ్ హబ్ ను జనసేనాని ప్రారంభించారు. అనంతరం ఆయన కార్యాలయాన్ని పూర్తిగా పరిశీలించారు. తన ఛాంబర్ లోకి వెళ్లి పరిశీలించారు. ఆ తరువాత కార్యాలయం సమావేశ హాల్లో వున్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, లోటుపాట్లను ఎప్పటికప్పుడు జనసేన నేతలకు, జనసైనికులకు అందించడమే ఐటీ సెంటర్ నాలెడ్జ్ హబ్ ల ముఖ్య ఉద్దేశ్యమని పవన్ కల్యాన్ అన్నారు.
గతంలో మిస్డ్ కాల్ తో జనసేనలో దాదాపుగా పది లక్షల మంది సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వారిలో దాదాపుగా 8 లక్షల మందికి జనసేన అవిర్భావం.. అవశ్యకత.. అన్న అంశాలతో పాటు బాధ్యతాయుతమైన జవాబుదారి ప్రభుత్వ ఏర్పాటు అనే అంశాలపై కూడా అవగాహన కల్పించామని అన్నారు. ఇక త్వరలోనే మరో ఇరవై మంది జనసైనికులు లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా 2 కోట్ల మంది తమ పార్టీ సభ్యత్వాలు పొందాలన్నదే లక్ష్యంగా జనసైనిక వాలెంటీర్లు కదులుతున్నారని పవన్ అన్నారు.
పార్టీ నిర్మాణం రాత్రికి రాత్రి జరిగిపోయే పనికాదని, చాలా ఒప్పగ్గా, సహనంతో చేయాల్సి వుంటుందని జనసేనాని అన్నారు. జనసేన అవిర్భావ సందర్భంలోనే తాను పాతిక సంవత్సరాలు దేశం కోసం, మన సమాజం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం తాను పనిచేయాల్సి వస్తుందని లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పానని అన్నారు. అయితే అప్పటి వరకు ఏయే వర్గాల ప్రజలు వ్యవస్థ అవసరాన్ని కావాలనుకుంటున్నారో.. ఏయే వర్గాలు పాలక వర్గాల నిర్లక్ష్యానికి గురవుతున్నాయో.. అయా వర్గాలకు జనసేన అండగా నిలుస్తుందని, వారికి మరింత చేరువవుతామని పవన్ అన్నారు.
అనంతరం జనసేన ప్రధాన కార్యదర్శి మాజీ ఐఏఎస్ అధికారి తొట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జనసేన సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ద్వారా పాతిక లక్షల మంది తమను సంప్రదించారని, వారి డాటాను పొందుపర్చి వారిని తిరిగి సంప్రదించి అందరికీ సభ్యత్వాలను అందిస్తున్నామని చెప్పారు. ఇక ఐటీ సెంటర్ ద్వారా అటు పార్టీ కార్యకర్తలందరినీ పవర్ స్టార్ పవన్ కల్యాన్ కలుస్తారని, అందరితోనూ కాంటాక్టు అయ్యేందుకు ఐటీ సెంటర్ దోహదపడుతుందని అన్నారు. వీరితోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతీ ఓటరుతో కూడా పవన్ కల్యాన్ ఇంటరాక్ట్ అవుతారని చంద్రశేఖర్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more