గౌరవప్రదమైన పోలీసు అధికారి హోదాలో ఉండి.. ఓ ఐపీఎస్ అధికారి చేయరాని తప్పు చేశాడు. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో అగకుండా కొత్త మురిపేం నేపథ్యంలో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహితతో చనువుగా వుంటూ.. తాళి కట్టిన భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో విషయం తెలుసుకున్న ఆయన భార్య.. ఎస్పీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే తనకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసిన ఐపీఎస్ అధికారిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.
హోంశాఖ ఆదేశంతో కేసు నమోదు చేసుకున్న బెంగళూరు అర్బన్ జిల్లాలోని కోరమంగళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అసలేం జరిగిందన్న వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. వారి కథనం ప్రకారం.. డీజీపీని కలిసిన ఎస్పీ డాక్టర్ భీమాశంకర్ గుళేద భార్య.. భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను అందజేస్తూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన డీజీపీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
అక్కడ ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తతోపాటు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ తన భార్య మానసిక వ్యాధితో బాధపడుతోందని పేర్కొన్నారు. ఆమెకు కొందరు తనపై లేనిపోనివి నూరిపోశారని ఆరోపించారు. వారి ప్రోద్బలంతోనే ఆమె కేసు పెట్టారని పేర్కొన్నారు. బాధితురాలి పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఎస్పీపై దర్యాప్తు చేయాలని కోరమంగళ పోలీసులను ఆదేశించింది. ఇక ఇదే సమయంలో వివాహిత భర్త కూడా ఎస్పీపై తన భార్యను అక్రమంగా బంధించాడని ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more