ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి, అగ్రరాజ్యంలో తన టాలెంట్ ను రుజువు చేసుకుని ఆ తరువాత తన ఉద్యోగం సంపాదించి.. తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఎన్నో ఆశలతో అమెరికాలోకి అడుగుపెట్టిన కొప్పు శరత్ ను ఈనెల 4వ తేదీన ఓ డిపార్టుమెంటల్ స్టోర్ లో జరిగిన దోపిడీలో.. ఓ అగంతకుడు నిర్థాక్షిణ్యంగా కాల్చివేసిన ఘటన తెలిసిందే. కాగా కాల్పులకు తెగబడిన అగంతకుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శరత్పై కాల్పులకు దిగిన దుండగుడిని మిస్సోరీ పోలీసులు గుర్తించారు. నిందితుడు కెన్సాస్ శివార్లలో ఉన్నట్టు తెలుసుకుని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కెదురైంది. పోలీసులను చూసి చూడగానే దుండగుడు తన వద్దనున్న మినీ ఏకే 47 తో పోలీసులపైకే కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో దుండగుడు హతమయ్యాడు.
దీనిపై కెన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్ ట్వీట్ చేశారు. లొంగిపోవాలని ఆదేశిస్తే నిందితుడు తన రైఫిల్ తో కాల్పులు జరిపాడని, దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు జరపడంతో అతను మరణించాడని చెప్పారు. ఈ ఎన్ కౌంటర్లో గాయపడిన ముగ్గురు పోలీస్ అధికారులను అసుపత్రికి తరలించామని, ప్రస్తుత వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. అంతకు ముందు నిందితుడి కోసం గాలించిన పోలీసులు సుమారు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అతడు ఎత్తుకెళ్లిన వాహనం గుర్తించి.. అతడు ఉన్న ఇంటిని కనుగొన్నారు. పోలీసులు కూడా భారీగా చేరుకోవడంతో దుండగుడు అక్కడ నుంచి తప్పించుకోడానికి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి మట్టుబెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more