తమిళనాడు, కోయంబత్తూరులో విషాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన మాక్ డ్రిల్ లో అపశృతి చోటుచేసుకుని ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు, లేదా అనుకోకుండా ప్రమాదాల వలయంలో చిక్కుకున్న తరుణంలో విద్యార్థులు ఆ పరిస్థితుల నుంచి ఎలా బయట పడాలన్న విధానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులందరి సమక్షంలో ఈ ఘటన జరగడంతో.. కలేజీలో విషాద వాతావరణం అలుముకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరులోని కళైమగన్ ఆర్ట్స్ కళాశాలలో మాక్ ( సెఫ్టీ) డ్రిల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కింద విద్యార్థులంతా ఓ నెట్ పట్టుకుని నిలుచుండగా, రెండో అంతస్తు నుంచి లోకేశ్వరి అనే విద్యార్థిని కిందకు దూకేందుకు అంగీకరించింది. అయితే అమె రెండో అంతస్థు నుంచి దూకే సమయంలో మాత్రం కొంత భయానికి గురైంది. ఇంతలో మాక్ డ్రిల్ ట్రయినర్ ఆమెను "దూకేయ్.. దూకేయ్" అంటూ ప్రోత్సహించాడు. లోకేశ్వరి భయపడుతుంటే కిందకు నెట్టేశాడు.
ఒక్కసారిగా నెట్టివేయడంతో అమెకు అదుపు తప్పింది. దూరంగా దూకాల్సిన అమె.. అలా కాకుండా అనుకోకుండా ప్రమాదవశాత్తు కింద పడినట్లుగా పడటంతో అమె తల మొదటి అంతస్తుకు ఉన్న సన్ షేడ్ (సజ్జా)కు బలంగా తాకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించగా, నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న ఆరోపణలపై మాక్ డ్రిల్ ట్రయినర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more