గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను తాము అపుతున్నామని, ఇక తెలంగాన కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకమని అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అందోల్ మండలం పోసాని పేట గ్రామ సర్పంచ్ స్వప్నారెడ్డి స్పష్టం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు ఏకంగా దేశంలోనూ బిసీలకు ఎంతో మేలు చేకూర్చింది కాంగ్రెస్ పార్టీయేనని అమె పేర్కోన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు లోబడే రిజర్వేషన్లు వుండాలని మాత్రమే తాము పిటీషన్ దాఖలు చేశామని అమె అన్నారు.
వాస్తవానికి రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి పంచాయితీరాజ్ ఎన్నికలను జరిపించాలన్న ఉద్దేశం లేదని.. అందుకనే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి మరీ ఎన్నికలల్లో రిజర్వేషన్లు కల్పించిందని అమె అరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడంది కాక.. వాటిపై ఎవరైనా కోర్టుకు వెళ్తారన్న అలోచన వుండే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అమె అరోపించారు. సర్వోన్నత న్యాయస్థానం అన్ని రిజర్వేషన్లు కలపి ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించకుండా చూసుకోవాలని అదేశాలను గతంలో జారీ చేసిందని అమె అన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, అత్యున్నత న్యాయస్థానం రూలింగ్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. రిజర్వేషన్ల కేటాయింపు 50 శాతానికి మించి ఉండకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అదేశాలను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అమె అన్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన కేసీఆర్, సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు చెప్పారు. ఇందుకు కారణం కూడా స్వప్పా రెడ్డి అని ఆయన ఒక కాంగ్రెస్ సర్పంచ్ పేరును లేవనెత్తడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైకోర్టు తీర్పుకు స్వప్నారెడ్డి కారణమని కేసీఆర్ చెప్పగా, ఆమె ఎవరా అని పలువురు చర్చించుకోవడం మొదలుపెట్టారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆమె గురించిన వివరాలు తెప్పించుకుని ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more