ప్రధాని నరేంద్రమోదీ మానస పుత్రికగా పేరొందిన బుల్లెట్ రైలుకు బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రకటించి నెలలు కావస్తున్నా.. ఇంకా అవరోధాలు, అడ్డుంకులు మాత్రం తొలగిపోకపోవడంతో ప్రాజెక్టు అధికారులకు శరాగాతంలా పరిణమించాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్రకు చెందిన రైతులు, గిరిజన సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రాజెక్టు పేరుతో భూ సమీకరణ చేయడాన్ని సవాలు చేస్తూ గుజరాత్ కు చెందిన రైతులు కోర్టును ఆశ్రయించారు.
కాగా తాజాగా, ముంబై పట్టణంలోనే అత్యంత అధికంగా భూమి కలిగిన సంస్థగా పేరొందిన గోద్రెజ్ కంపెనీ కూడా బుల్లెట్ రైలు ప్రాజెక్టు అలైన్ మెంటుకు మోకాలడ్డుతోంది. అహ్మదాబాద్-ముంబై మధ్య చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో గోద్రెజ్ సంస్థకు కూడా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సివస్తుంది. ప్రాజెక్టులో భాగంగా ముంబై శివారులోని విఖ్రోలిలో ఉన్న గోద్రెజ్ కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
ప్రభుత్వ ప్రతిపాదన కారణంగా తమకు ఎంతో కీలకమైన 8.6 ఎకరాలు కోల్పోవాల్సి వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాబట్టి ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ నెల 31న ఇది విచారణకు రానుంది. దీంతో ప్రాజెక్టు అలైన్మెంట్ అధికారులు కూడా ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారని సమాచారం. ఇక కేంద్ర ప్రభుత్వం ఎటవంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కాగా, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య 508.17 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more