TRS MLA Somarapu Satyanarayana to quit politics టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజకీయ వైరాగ్యం

Tsrtc chairman somarapu satyanarayana to quit politics

somarapu satyanarayana to quit politics, somarapu satyanarayana stoicism, somarapu satyanarayana ramagundam mayor, somarapu satyanarayana trs, somarapu satyanarayana ramagundam mla, somarapu satyanarayana, TRS MLA, TSRTC Chairman, Ramagundam MLA, Mayor, quit politics, Stoicism, Telangana, politics

The swearing-in has begun in the karnataka Vidhana Soudha. Former chief minister Siddaramaiah and recently sworn in chief minister BS Yeddyurappa have taken the oath of office.

రాజకీయాల్లో మనజాలను.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజకీయ వైరాగ్యం

Posted: 07/09/2018 04:26 PM IST
Tsrtc chairman somarapu satyanarayana to quit politics

అధికార టీఆర్ఎస్ లో సరిగ్గా ఎన్నికల ముందు అంతర్గత విభేధాలు బయటపడతున్నాయి. పలు చో్ట్ల పార్టీ మేయర్, చైర్ పర్సన్ అభ్యర్థులపై అవిశ్వాసాలు అక్కడి ఎమ్మెల్యేలకు శాపాలుగా మారుతున్నాయి. ఇక మరో చోట మేయర్ అభ్యర్థులు వర్గ రాజకీయాలతో ఎమ్మెల్యేలు కూడా రాజకీయ వైరాగ్యాలను ప్రదర్శిస్తూన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే సోమారపు సత్యానారాయణకు వచ్చింది. చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నానని అందుకే పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రామగుండం మేయర్‌ అవిశ్వాస పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన సింగరేణి కార్మికులు, రామగుండం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులతో భేటీ అయి మాట్లాడుతూ టీఆర్‌ఎస్లో తనకు గౌరవం లేదని అన్నారు. పార్టీలో అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్ లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని వ్యాఖ్యానించారు.

పదవుల్లో ఉంటానని... విధులకు హాజరుకానని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెలతో నాలుగు సంవత్సరాల గడువు ముగిసింది. అసలేం జరిగింది.. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా మున్సిపాలిటీలో, అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో వర్గం పోరు ఎక్కువగా కొనసాగుతోంది. దాదాపుగా 20కిపైగా మున్సిపాలిటీలో అధికారపార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్‌లపై, అధికార పార్టీ కార్పొరేటర్‌లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు.
 
ప్రధానంగా రామగుండం మున్సిపాలిటీలో వర్గ పోరు ఇటు టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇండిపెండెట్ అభ్యర్థి లక్ష్మీనారాయణను అధిష్టానం మేయర్‌గా నియమించింది. అయితే ఆయన వ్యవహారశైలిని మొదటి నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా మేయర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల అవిశ్వసాస తీర్మాన గడువు గత నెలలో ముగియడంతో మేయర్‌పై కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.

అవిశ్వాస తీర్మానం ఇవాలో, రేపో జరుగుతందన్న సమయంలో అధిష్టానం ఆదేశాల మేరకు. ఆయన వర్గం కార్పోరేటర్లు నోటీసులు వెనక్కి తీసుకున్నారు. ఏకంగా ఎమ్మెల్యే పై మంత్రి కేటీఆర్ ఒత్తడి తీసుకువచ్చారని కూడా సమాచారం. దీంతో తీవ్ర మన్స్తాపానికి గురైన సోమారపు సత్యనారాయణ.. తాను ఈ వర్గ రాజకీయాలలో మనజాలలేనని చెప్పి.. రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు చెప్పారు.
అధిష్టానం నుంచి ఒత్తిళ్లు ఏర్పడుతున్న నేపథ్యంలో తాను పార్టీలో కొనసాగలేనని సోమారపు సత్యనారాయణ నిర్వేదం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles