అధికార టీఆర్ఎస్ లో సరిగ్గా ఎన్నికల ముందు అంతర్గత విభేధాలు బయటపడతున్నాయి. పలు చో్ట్ల పార్టీ మేయర్, చైర్ పర్సన్ అభ్యర్థులపై అవిశ్వాసాలు అక్కడి ఎమ్మెల్యేలకు శాపాలుగా మారుతున్నాయి. ఇక మరో చోట మేయర్ అభ్యర్థులు వర్గ రాజకీయాలతో ఎమ్మెల్యేలు కూడా రాజకీయ వైరాగ్యాలను ప్రదర్శిస్తూన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే సోమారపు సత్యానారాయణకు వచ్చింది. చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నానని అందుకే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రామగుండం మేయర్ అవిశ్వాస పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన సింగరేణి కార్మికులు, రామగుండం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులతో భేటీ అయి మాట్లాడుతూ టీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని అన్నారు. పార్టీలో అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్ లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని వ్యాఖ్యానించారు.
పదవుల్లో ఉంటానని... విధులకు హాజరుకానని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెలతో నాలుగు సంవత్సరాల గడువు ముగిసింది. అసలేం జరిగింది.. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా మున్సిపాలిటీలో, అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో వర్గం పోరు ఎక్కువగా కొనసాగుతోంది. దాదాపుగా 20కిపైగా మున్సిపాలిటీలో అధికారపార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లపై, అధికార పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు.
ప్రధానంగా రామగుండం మున్సిపాలిటీలో వర్గ పోరు ఇటు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇండిపెండెట్ అభ్యర్థి లక్ష్మీనారాయణను అధిష్టానం మేయర్గా నియమించింది. అయితే ఆయన వ్యవహారశైలిని మొదటి నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా మేయర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల అవిశ్వసాస తీర్మాన గడువు గత నెలలో ముగియడంతో మేయర్పై కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.
అవిశ్వాస తీర్మానం ఇవాలో, రేపో జరుగుతందన్న సమయంలో అధిష్టానం ఆదేశాల మేరకు. ఆయన వర్గం కార్పోరేటర్లు నోటీసులు వెనక్కి తీసుకున్నారు. ఏకంగా ఎమ్మెల్యే పై మంత్రి కేటీఆర్ ఒత్తడి తీసుకువచ్చారని కూడా సమాచారం. దీంతో తీవ్ర మన్స్తాపానికి గురైన సోమారపు సత్యనారాయణ.. తాను ఈ వర్గ రాజకీయాలలో మనజాలలేనని చెప్పి.. రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు చెప్పారు.
అధిష్టానం నుంచి ఒత్తిళ్లు ఏర్పడుతున్న నేపథ్యంలో తాను పార్టీలో కొనసాగలేనని సోమారపు సత్యనారాయణ నిర్వేదం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more