ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన తన రాజీనామా లేఖను పంపుతూ, తక్షణమే ఆమోదించాలని కోరారు. తనపై కొన్ని రోజులుగా కొందరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా తనను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న యత్నాలకు తాపే అవకాశం ఇవ్వడం ఇష్టంలేక తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిన్న తూర్పుగోదావరిలో మాట్లాడుతూ ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తూ బీజేపీని తిడతారని.. మరోపక్క కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ను తన పక్కనే పెట్టుకుంటారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు పరకాల పేర్కొన్నట్లు సమాచారం. పరకాల ప్రభాకర్ నాలుగేళ్లుగా ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తూ నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు రాసీన లేఖలో తాను ప్రభుత్వ సలహాదారుగా వుండటాన్ని కొందరు ఎత్తిచూపుతున్నారని పేర్కోన్నారు. కేంద్రంపై జరుగుతున్న ధర్మపోరాట విషయంలో ప్రజల్లో అనుమానాలు లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే తాను తప్పుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో తన ఉనికిని, ప్రభుత్వాధినేత చిత్తశుద్దినీ శంకించడానికి వాడుకుంటున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను అపాదిస్తున్నారని ఆయన కలతచెందారు. తన కుటుంబసభ్యులు వేరే పార్టీలో తనకు భిన్నమైన అభిప్రాయాలు కలిగివున్నందుకు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీపడతానని ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందని అవేదన వ్యక్తం చేశారు.
పరిణితి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్దులుగా వుంటారని పరకాల చురకలంటించారు. వారి అభిప్రాయాలు పట్ల, వారికున్న అంకిత బాంధవ్యాలు అడ్డురావని పేర్కోన్నారు.
రాష్ట్ర హక్కుల సాధనకు చేపట్టిన ధర్మపోరాట దీక్ష విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిపై నీలినీడలు పడకూడదన్నది తన కోరికగా ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కోన్నారు. తన వల్ల, చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం జరగకూడదన్నదే తన అభిప్రాయంగా చెప్పుకోచ్చారు. సీఎంపైన, ఆయన ప్రభుత్వంపైనా బురదజల్లడానికి, లేనిపోని అరోపణలు చేయడానికి తన పేరును, తన కుటుంబ సభ్యుల పేర్లను ఎవ్వరూ వాడుకోకూడదని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more