గుజరాత్ ఎన్నికలకు ముందు తన సొంత రాష్ట్ర ప్రజలతో కూడిన సమావేశంలో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన హత్యకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుపారీ ఇచ్చాడని వెల్లడించిన తరువాత.. ఇక దేశవ్యాప్తంగా తన ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ కూడా తగ్గుతున్న క్రమంలో ప్రధానమంత్రి హత్యకు మావోయిస్టులు పథక రచన చేశారని వార్తలు తెరపైకి వచ్చాయి.
అయితే దీనిపై పలు ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేసినా.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే ప్రధాని మమోడీని కూడా హతమార్చాలన్నది వారి ప్లాన్ అని పోలీసులు పసిగట్టినట్టు తెలిసిందే. దీంతో ప్రధానికి భద్రతను కట్టుదిట్టం చేసిన భధ్రతా వలయం అధికారులను తాజాగా ఓ గుర్తుతెలియని ఎగిరే పళ్లెం తరహా వాహనం మాత్రం ఉరుకులు పరుగుల పెట్టించింది. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసమున్న లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఆకాశంలో ఎగిరే పళ్లెంలాంటి ఓ యూఎఫ్ఓ సుమారు అరగంట పాటు తచ్చాడింది.
ఈ ఘటన ఈ నెల 7వ తేదీన చోటుచేసుకుందని, గుర్తు తెలియని వస్తువు ఒకటి తరగడం తాము గమనించామని ప్రధాని భద్రతను పర్యవేక్షించే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆదేంటో తెలుసుకునే ప్రయత్నం చేశామని, దాని గురించిన సమాచారం మాత్రం లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన నివేదికలో భద్రతా అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్, భద్రతా కారణాల దృష్ట్యా అది ఏంటన్న విషయాన్ని బయటకు చెప్పలేమని వ్యాఖ్యానించారు.
ప్రధాని నివాసం వద్ద గుర్తు తెలియని ఓ వస్తువు ఆకాశంలో చక్కర్లు కొట్టిన మాట మాత్రం నిజమేనని, ఆపై క్షుణ్ణంగా తనిఖీలు చేశామని, ప్రమాదకరమైనవేవీ తమ దృష్టికి రాలేదని అన్నారు. ఇదిలావుండగా, గత సంవత్సరం సెప్టెంబర్ 17న రాత్రి సమయంలో పార్లమెంట్ చుట్టూ ఓ గుర్తు తెలియని డ్రోన్ వంటి ఆకారం చక్కర్లు కొడుతోందని పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చిందన్న సంగతి తెలిసిందే. అయితే, రాడార్లలో దీని జాడ ఏమీ కనిపించలేదని ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more