అవకాశం ఎప్పుడు దొరుకుతుందా.? అంటూ ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విపక్షాలతో పాటు ఇటు ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై.. అది పాటిస్తున్న విధానాలను నిషితంగా గమనిస్తునూ వున్నాయి. ఈ క్రమంలో ఇవాళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ను ప్రధాని మోదీ స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనపై విపక్షాలు గళంవిప్పాయి. వ్యక్తిగా మోడీ ఫిట్ నెస్ గా వున్న ఛాలెంజ్ ను స్వీకరించడం కన్నా ముందుగా.. దేశ ప్రధానిగా తమ సవాళ్లను కూడా ప్రధాని స్వీకరించాలని డిమాండ్ చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రధాని స్వీకరించిన విరాట్ కోహ్లీ ఛాలెంజ్ పై స్పందిస్తూ... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఛాలెంజ్ ను మీరు స్వీకరించడం పట్ల ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలు లేవని... మరి, మా ఛాలెంజ్ ను కూడా స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. రైతులకు ఉపశమనం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, దళితులు, మైనార్టీల పట్ల హింస తదితర సవాళ్లను కూడా మీరు స్వీకరించాలని కోరుతున్నామని చెప్పారు. 'మా ఛాలెంజ్ ను స్వీకరిస్తారా మోదీ సార్?' అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించారు.
ఇక అ వెనువెంటనే కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విరాట్ సవాల్ ను స్వీకరించడంపై స్పందించింది. దేశ ప్రధానిగా ప్రధాని నరేంద్రమోడీ ముందు అనేక సవాళ్లు వున్నాయని, ఆయన వ్యక్తిగా సవాళ్లను ఎదుర్కోవడం కన్నా ప్రభుత్వపరంగా పాలనా విధానాలపై, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సవాళ్లను ఎదుర్కోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధు రణ్ దీప్ సూర్జేవాలా ప్రధాని సవాలుపై స్పందిస్తూ.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రధాని ఎదుట వున్న సవాళ్లను, నాలుగేళ్ల ముందు ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేశారు.
దేశంలో సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న పెట్రోల్, డీజీల్ ధరలను ముందుగా కట్టడి చేసే సవాల్ ను ఎదుర్కోవాలని.. ఎందుకంటే గత నాలుగేళ్లుగా 11 సార్లు పెంచిన ఇంధన ధరలతో పది లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి ఎక్సైజ్ సుంకం పేరుతో దండుకున్నారని.. కనీసం ఇప్పుడైనా వాటిని కట్టడి చేయండని ఆయన అన్నారు. దీంతో పాటుగా ఏడాది యాభై లక్షల ఉద్యోగాలను కల్పిస్తానన్న మీ ఎన్నికల హామి మేరకు నిరుద్యోగులైన యువత గత నాలుగేళ్లుగా రెండు కోట్ల ఉద్యోగాల కోసం అశగా ఎదురుచూస్తున్నారని, వారి నుంచి కూడా సవాల్ ఎదుర్కోవాలని అయన ట్వీట్ లో పేర్కోన్నారు.
రైతులకు మెరుగైన మద్దతు ధరతో పాటు వారు పండించిన పంటకు అయిన ఖర్చులో యాభై శాతం పెట్టుబడిని కూడా ఇస్తామన్న సవాల్ ను ఎదర్కోవాలని, దీంతో పాటు విదేశాలలో వున్న రూ.80 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్వదేశానికి రప్పిస్తానని చేసిన హామీని, అవినీతి లేని ప్రభుత్వ పాలనను అందించాలని పేర్కోన్నారు. దీంతో పాటు ప్రభుత్వంలో అవినీతికి పాల్పడుతూ పలు కుంభకోణాలను పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించే సవాల్ ను ఎదుర్కోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పోరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాలు భారత భూభాగంలోకి చొచ్చుకోస్తూ.. జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్న సవాల్ ను ఎదుర్కోవాలని అన్నారు. ప్రచారం కోసం కాకుండా పాలనాపరమైన సవాళ్లను స్వీకరించాలని సూర్జీవాలా డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more