రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చిన మహారాష్ట్ర మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్.. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. అయితే చంద్రశేఖర్ కొంతకాలం కిందే జనసేనలోకి చేరినా.. ఆయన పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన పవర్ స్టార్ మాత్రం ఆయకు తాజాగా కీలక బాధ్యతలను అప్పగించారు. ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయన్న విషయాలతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయాలపై కూడా చక్కని అవగాహన వుంది.
ఈ నేపథ్యంలో తొట చంద్రశేఖర్ కు పవన్ కల్యాణ్ పార్టీలో ప్రాధాన్యత కల్పించడంతో పాటు ప్రముఖ స్థానం కూడా అందించారు. ఏకంగా ఆయనను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన చంద్రశేఖర్, 2008 వరకూ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతానికి చెందిన తోట చంద్రశేఖర్ తన పదవీ విరమణ తరువాత.. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పట్ల అకర్షితులై ఆ పార్టీలో చేరారు. గుంటూరు నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా వుండిపోయారు.
ఇటీవల జనసేనలో చేరిన చంద్రశేఖర్, అప్పటి నుంచి పవన్ కు సన్నిహితుడిగా మారి, సలహాలు, సూచనలు ఇస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రశేఖర్ ను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనూ నియమించిన పవన్, ఏపీకి వచ్చిన నిధుల లెక్కలు బయటకు తీయడంలో ఆయన పడిన శ్రమను గుర్తించారు. ఇప్పుడాయనకు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు లేదా గుంటూరు లోక్ సభ స్థానానికి ఆయన పోటీ పడవచ్చని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more