దేశచరిత్రలోనే ఇంధన ధరలు భగ్గమంటున్నాయి. వాహనదారులతో పాటు సగటు సామాన్య మధ్యతరగతి వారిపై ధరల భారం మెండుగా పడుతుంది. కర్నాటక ఎన్నికలతో 19 రోజుల పాటు స్తబ్దంగా ఉన్న ఇ:ధన ధరలు.. అనంతరం అకాశానంటేలా పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెరిగిన ధరలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేశాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి రూ. 76.24కు చేరింది. గతేడాది జూన్ నుంచి రోజువారీ ధరలు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇది మునుపెన్నడూ ఎరుగని ధర కావడం గమనార్హం. అదేవిధంగా లీటర్ డీజిల్ ధర అధికంగా 26 పైసలు పెరిగి రూ. 67.57కు చేరుకుని అకస్మాత్తుగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
అయితే, దేశంలోని మెట్రోనగరాలు, రాష్ట్ర రాజధానుల్లో ఉండే ధరలతో పోల్చుకుంటే దేశరాజధానిలోని ధరలు మాత్రం తక్కువగా ఉన్నాయి. దేశంలోని పలు నగరాల్లో పెరిగిన పెట్రోల ధరలు ఈ విధంగా ఉన్నాయి. అధిక స్థానిక పన్నులతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.07గా ఉంది. కోల్కతాలో రూ. 79.91, చెన్నైలో రూ. 79.13, భోపాల్లో రూ. 81.83, పాట్నాలో రూ. 81.73, శ్రీనగర్లో రూ. 80.35గా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ.80.76 కు చేరింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.82.8కి చేరుకుంది. గోవా రాజధాని పనాజీలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ. 70.26తో అతితక్కువగా ఉన్నది. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఇక డీజిల్ విషయానికొస్తే.. దేశ చరిత్రలోనే గరిష్టంగా రూ.67.57కి పెరిగింది. హైదరాబాదులో లీటర్ డీజిల్ ధర రూ.73.45 కాగా.. త్రివేండ్రంలో రూ.73.45, రాయ్ పూర్ రూ.72.96, గాంధీనగర్ రూ.72.63, భువనేశ్వర్ రూ.72.43గా ఉంది. ముంబైలో రూ.71.94, కోల్ కతా, చెన్నైల్లో రూ.71.32గా ఉంది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అడ్డగోలుగా పన్నులు బాదుతూ పోవడం వల్లే పెట్రోల్, డీజిల్ రేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
కాగా డీజిల్ ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డీజిల్ పెరగడంతో రవాణా చార్జీలు పెరిగి తద్వారా నిత్యావసర సరుకుల ధరలపై వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు వుండటంతో.. మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న ధరలపై భగ్గుమంటున్నారు. కూడ్ర్ అయిల్ తగ్గిన క్రమంలో కేంద్రం పెంచిన తొమ్మిది రూపాయల ఎక్సైజ్ ధరనైనా తగ్గించాలని మధ్యతరగలి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ధరలు పెరిగిన ప్రతీసారి ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే సన్నాహాలు జరుగుతున్నాయ్ అంటూ ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వ్యాఖ్యానిస్తున్నారే తప్ప.. ఇప్పటి వరకు అందుకు తగ్గ చర్యలు మాత్రం కనీసం అడుగు కూడా ముందుకు పడలేదని మధ్యతరగతి ప్రజలు మండిపడ్డుతున్నారు. ధరలు తగ్గిన క్రమంలో రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుని సుంకాన్ని పెంచిన కేంద్రం.. ధరలు పెరిగిన తరుణంలో మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని వాహనదారులు కూడా కేంద్రంపై తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more