తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసెట్ 2018 ఫలితాలను ఇవాళ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విడుదల చేశారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షలు తొలిసారిగా కంప్యూటర్ అధారితంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో ఇంజినీరింగ్ విభాగంలో 78.24శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 1,19 వేల 270 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా, పోరుగునున్న తెలుగు రాష్ట్రం అంధ్రప్రదేశ్ నుంచి సుమారు 17 వేల 41 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
సచివాలయంలో ఫలితాలను విడుదల చేసిన ఢిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ వివరాలను మీడియాకు తెలుపుతూ.. మొత్తంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు సంబంధించి 1 47 వేల 957 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు రిజిస్టర్ చేసుకున్నారని, అయితే వారిలో 136305 మంది పరీక్షలను రాశారని తెలిపారు. కాగా పరీక్షలు రాసిన విద్యార్థులలో 1లక్ష 06 వేల 646మంది విద్యార్థులు అర్హత పొందారు. అలాగే ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ సహా సంబంధిత స్ట్రీమ్ ఇంజనీరింగ్ లో 73,106 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారిని కడియం తెలిపారు.
కాగా వీరిలో పరీక్షలు రాసిన వారు 66 వేల 858 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 90.72శాతంతో 60 వేల 651 మంది అర్హత పొందారు. అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఇవాళ కేవలం 94,592 మందికి మాత్రమే ర్యాంకులు జారీ చేస్తున్నామని చెప్పారు. అర్హత పోందిన మిగిలిన విద్యార్థులు క్వాలిఫయింగ్ పరీక్ష అయిన ఇంటర్లో కొందరు ఫైయిల్ అయ్యారని, వారు సప్లిమెంటరీ పరీక్షలు రాసారని వారు అందులో ఉత్తీర్ణత సాధించిన తరువాతే ర్యాంకులు జారి చేస్తామని చెప్పారు. ఇక మరోవైపు సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు కూడా వెలువడాల్సి వుందని కడియం అన్నారు.
కౌన్సిలింగ్ ను పూర్తి చేసి పస్ట్ రౌండ్ అడ్మీషన్లను చేపట్టాలని ఈ నెల 18నే నోటిఫికేషన్ విడుదల చేశామని ఆయన చెప్పారు. పస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఈ నెల 25న ప్రారంభమై వచ్చే నెల 8న ముగుస్తుందని, ఇందులో భాగంగానే సీట్ల కేటాయింపులు కూడా జరుగుతాయని కడియం చెప్పారు. ఇక రెండో రౌండ్ కౌన్సిలింగ్ జూలైలో మొదటి వారంలో జరుగుతుందని చెప్పారు. ఇక ఈ సారి తరగతులను పక్షం రోజులు ముందుగానే ప్రారంభించాలని.. అంటే జులై 16 నుంచి ప్రారంభించాలని కూడా నిర్ణయించామని కడియం శ్రీహరి చెప్పారు.
Click Below Links For TS Eamcet Results:
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more