సినిమా కథల్లో తప్ప మనకు ఎక్కడా వినిపించని, కనిపించని ఘటనలు అప్పడప్పుడు మనం వింటూనే వుంటాం. సరిగ్గా అదే సినీమా తరహలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలలో యమగోల, యముడికి మొగుడు, యమదొంగ లాంటి చిత్రాల్లో మనిషి జీవిత కాలం తీరకముందే పొరబాటున యమపురికి తీసుకెళ్లి.. ఆ తరువాత తిరిగి వెనక్కు పంపించే ఘటనలు మనం సినిమాల్లోనే చూశాం. కానీ ఇక్కడ ఈ మనిషి మాత్రం ఆ అనుభవాన్ని పొందాడు. తనకేమైందో తెలియదు.. ఏమీ గుర్తులేదు.. కానీ అచ్చింగా అలానే జరిగిందని గుర్తుచేసుకున్నాడు. అతడు మరణించాడని సరిగ్గా అతని చితికి తలకొరివి పెట్టేసమయానికి లేచి కూర్చుని బంధువులను, గ్రామస్థులను, కుటుంబసభ్యులను అశ్చర్యానికి గురిచేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా కిర్తలా గ్రామానికి చెందిన రామ్ కిషోర్ సింగ్, అలియాస్ భూరాసింగ్ (53).. అచేతనంగా ఏ కదలిక లేకుండా పడివుండటంతో అతనికి ఏమైందోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని పరీక్షించిన వైద్యులు మరణించాడని నిర్దారించారు. అకస్మాత్తుగా ఎలా మరణించిన భూరాసింగ్ బౌతికకాయానికి బంధువులు కబురుపెట్టిగానే వారు చేరుకున్నారు. ఇక బంధువులు, గ్రామస్థులు దహనసంస్కారాలు ఏర్పాటు చేశారు. అంత్యక్రియలకు అంతా రెడీ చేశారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామంలోని భూరాసింగ్ స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. అంతా కలిసి పాడెపై శ్మశానానికి తీసుకెళ్లారు. చితి పేర్చారు. మంటపెట్టడమే ఆలస్యం. ఇంతలో అకస్మాత్తుగా భూరాసింగ్ లేచి కూర్చున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన బంధువులు.. ఏం జరిగిందని ఆయనను అడుగగా.. తనకు పెద్దగా జ్ఞాపకం లేదు కానీ, తానో చోటుకి వెళ్లానని, అక్కడ మరి కొంత మంది కూర్చుని ఉన్నారని చెప్పాడు. అక్కడ పెద్ద గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి ఇతన్ని అప్పుడే ఎందుకు తెచ్చారు? అంటూ ప్రశ్నించాడని, ఇతనిని తీసుకొచ్చేందుకు ఇంకా సమయం ఉందని తెలిపాడని చెబుతున్నాడు.
ఆ తరువాత తనను ఎవరో తోసేసినట్టైందని, కళ్లు తెరిచి చూసేసరికి బంధువులంతా కనిపించారని అంటున్నాడు. దీంతో ఆయనను ఇప్పుడు మిరకిల్ మ్యాన్ గా గ్రామస్థులు పిలిచుకుంటున్నారు. దీనిపై వైద్యనిపుణులు మాట్లాడుతూ, అతడు చనిపోవడం నిజం కాదని అన్నారు. ఒక్కోసారి గుండె బాగా నెమ్మదిగా కొట్టుకోవడం వల్ల కోమాలోకి వెళ్తారని, దీంతో వారు చనిపోయినట్టుగా వైద్యులు పొరపాటు పడతారని, వాస్తవానికి వారు బతికే ఉంటారని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయని వారు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more