డీజిల్, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. శుక్రవారం డీజిల్ ధర ఆల్ టైం గరిష్ఠానికి చేరింది. ఢిల్లీలో ఈరోజు లీటర్ డీజిల్ ధర రూ.65.31గా ఉంది. కోల్కతాలో రూ.68.01గా, ముంబయిలో రూ.69.54గా, చెన్నైలో రూ.68.9గా ఉంది. పెట్రోల్ ధర కూడా 55 నెలల గరిష్ఠానికి చేరింది. ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ ప్రకారం డిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.08గా ఉంది. 2013 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక ధర.
ఈ ఏడాది మార్చి నుంచి ప్రముఖ నగరాల్లో పెట్రోల్ ధర 50పైసలకు పైగా, డీజిల్ ధర 90పైసలకు పైగా పెరిగింది. ఏడాది ప్రారంభంలోనూ ప్రముఖ నగరాల్లో పెట్రోల్ ధర రూ.4కు పైగా, డీజిల్ ధర రూ.5-6 మధ్యలో పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ గత ఏడాది జూన్ లో పదిహేను రోజులకోసారి ధరలు మార్చే విధానాన్ని తీసేసి ప్రతి రోజూ ధరలు మారే విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో ధరల మార్పు ప్రభావం వెంటనే చూపిస్తోంది.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.73.73తో నాలుగేళ్ల గరిష్ఠానికి చేరగా, డీజిల్ ధర రూ.64.58పైసలతో ఆల్ టైం గరిష్ఠానికి చేరింది. ధరలు బాగా పెరుగుతుండడంతో ప్రభుత్వం ఎక్సైజ్ పన్నులు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాసియా దేశాల్లో భారత్ లోనే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు అధికంగా ఉన్నాయి. కాగా ఈ విషయమై కేంద్రమాజీ అర్థిక శాఖా మంత్రి చిదంబరం కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు 74 యూఎస్ డాల్లర్లు వుందని, అయితే ఇది 2014 మే నెలతో పోల్చితే దాదాపపుగా 31 డాలర్లు తక్కువగా వుందని.. కానీ అప్పటి పెట్రోల్ ధర కన్నా ఇప్పటి పెట్రోల్ ధర ఎందుకు పెరిగిందని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more