PK says his 'investors' will understand in the days to come ధుష్టచతుష్టయానికి అర్థమైయ్యే రోజు ముందుంది: పవన్

Pawan kalyan says his investors will understand in the days to come

pawan kalyan, janasena, mahaa news, sujana chowdary, srini raju, tv 9, srini raju ram gopal varma, srini raju ramalinga raju, pawan kalyan fans, pawan kalyan ravi prakash, pawan kalyan srini raju, pawan kalyan nara lokesh, pawan kalyan chandrababu, pawan kalyan tweets, pawan kalyan mother, sri reddy, pawan kalyan on sri reddy controversy, pawan kalyan on sri reddy, sri reddy pawan kalyan news, pawan kalyan twitter posts, andhra pradesh, politics

After posting a series of tweets reacting to actor Sri Reddy's remarks against him, Power star Pawan Kalyan again tweets on the issue warns even mahaa news to face consequences.

దుష్టచతుష్టయానికి.. ఎందుకిలా చేశామని బాధపడే రోజు వస్తుంది: పవన్ కల్యాన్

Posted: 04/20/2018 04:15 PM IST
Pawan kalyan says his investors will understand in the days to come

తల్లిని విమర్శిస్తూ.. అసభ్యపదజాలంతో తిట్టించిన దుష్టచతుష్టయం ఫోటోలను ఇవాళ ఉదయం వరుస ట్వీట్ల ద్వారా విడుదల చేసిన జనసేనాని, పవర్ స్టార్ పవన్.. ఫిల్మ్ చాంబర్ లో పెద్దలతో చర్చించి తిరిగి వచ్చిన తరువాత మరోమారు ట్విట్టర్ ద్వారా మరోమారు పలు పోస్టులు పెట్టారు. దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ప్రోత్సాహంతో యువనటి శ్రీరెడ్డి అసభ్యపదజాలాన్ని వాడిందని, అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో ఈ అంశంపై చర్చలు నిర్వహించి, పదే పదే అవే అసభ్యదృష్టాలను ప్రసారం చేసిన టీవీ ఛానెళ్లపై పవన్ కల్యాణ్‌ మండిపడుతున్నారు.

ఫిలిం ఛాంబర్‌ నుంచి వెళ్లిపోయిన పవన్ కల్యాణ్‌ తాజాగా ట్వీట్ చేస్తూ.. నా తల్లిపై అసభ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు ఎంపీ సుజనా చౌదరి లేదా ఆయన బినామీ నుంచి నిధులు పొందుతున్న మహాన్యూస్‌ టీవీ ఛానెల్.. కూడా పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని ట్వీట్ చేశారు. ఇక జర్నలిస్టుమంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా జర్నలిజం విలువలను మర్చిపోయేలా వ్యవహరిస్తూ.. ఎల్లో జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో మహాటీవీ సీఈవో మూర్తి కూడా..'  అంటూ పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ చేశారు.

కాగా, మెరుగైన సమాజం కోసం అంటూ.. కులం అని అడిగిన వాడిని చెప్పుతో కొట్టండి అంటూ ప్రజలకు నీతులు వల్లేవేసే టీవీ9పై కూడా పవన్ మరోసారి ట్వీట్ చేశారు. తనపై పథకం ప్రకారం కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ దుష్టచతుష్టయం చేసిన దారుణమైన పనికి.. రానున్న రోజుల్లో ఇంత దిగజారిన పనికి ఎందుకు పాల్పడ్డామా.? అని అలోచించాల్సిన రోజు వస్తుందని అన్నారు. శ్రీనిరాజు.. రాంగోపాల్ వర్మకు బందువు కూడా కావడం..  ఇక శ్రీనిరాజు.. సత్యం రామలింగరాజకు కూడా బంధువని పవన్ తన పోస్టులలో పేర్కోన్నారు.

అయితే ఇలా డబ్బులున్న పెద్దలు పబ్లిక్ గా ఎవరి తల్లినైనా తిట్టేస్తారా..? తమ టీఆర్పీల కోసం ఎంత నీచానికైనా పాల్పడతారా..? అంటూ అయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో వారు ఎందుకిలా చేశామా అని బాధపడాల్సిన తరుణం వస్తుందని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇక టీవీ 9లో రవి ప్రకాశ్‌, శ్రీని రాజులకు వున్న షేర్ల వివరాలను తెలుపుతూ వున్న ఓ పేజీని కూడా పవన్ పోస్టు చేశారు. శ్రీని రాజుపై మళ్లీ ట్వీట్ చేశారు. ఆయన కొత్త ఫొటో ఇది అని ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే, ఆయనకు టీవీ9లో 88.69% షేర్‌ ఉందని స్ఫష్టం చేసే ఒక పోస్టును పవన్ తన ఖాతాలో పోస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles