దేశంలోని అనేక అవినీతి అక్రమాలను భయటపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు ఇటు రాష్ట్రంలోనూ భారీ కుంభకోణం జరగిందని నివేదికలో వెల్లడించింది. అయితే ఈ అంశాలు పక్కదారి పట్టేందుకు ఏకపక్షంగా సాగిన అసెంబ్లీలో బీజేపి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమర్థవంతంగా కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం అంశాన్ని జనంలోకి వెళ్లనీయకుండా చేయడంలో సఫలీకృతం అయ్యింది. అందుకు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అన్న అంశాన్ని తెరపైకి పచ్చ మీడియాతో తీసుకువచ్చేలా చేసి.. అదే పెద్ద అంశంగా స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ రచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన 2016 సంవత్సరానికి చెందిన ఆర్థిక లావాదేవీల ఖాతాల వివరాలను కాగ్ వెల్లడించింది. అయితే ఇందులో ఒక్క పట్టిసీమ ప్రాజెక్టులోనే అవినీతి అంచానాలకు మించి జరిగిందని కాగ్ తన నివేదికలో పేర్కోంది. ఏపీలోని చంద్రబాబు సర్కార్ కృష్ణా, గోదావరి జలాలను కలిపిన తొలి ప్రాజెక్టు తమదని గొప్పలు చెప్పుకున్న ప్రాజెక్టులో అసలు అంచనాకు అయిన ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని కాగ్ తన నివేదికలో పొందుపర్చింది.
పట్టిసీమ ప్రాజెక్టులో ప్రభుత్వం రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాగ్ నివేదిక తేల్చేసింది. ఈ ప్రాజెక్టుఅసులు రూ.1170.25 కోట్లు కాగా, టెండర్లను అహ్వానించే 2015 మార్చి నాటికి దీనిని వ్యయాన్ని రూ. 1427గా సవరించారని.. ఇది ఏకంగా 22శాతం అధికమని కాగ్ తన నివేదికలో పేర్కోంది. ఇక ఈ టెండర్లను మోగా ఇంజనీరింగ్ అండ్ ఇనఫ్రాస్టక్చర్ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిని ఇచ్చిన తరువాత అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1600 కోట్లకు పెంచిందని కాగ్ వెల్లడించింది.
ఇరవై ఏళ్ల పాటు పట్టిసీమ ప్రాజెక్టు జీవితకాలం వుంటుందని ప్రాజెక్టు డీటైల్డ్ రిపోర్టులో పేర్కొన్న ప్రభుత్వం.. కేవలం పోలవరం ప్రాజెక్టు పూర్తేయ్యే వరకు ఈ ప్రాజెక్టు నడుస్తుందన్నది అసలు విషయం. అయితే ప్రాజెక్టు రిపోర్టులో కూడా తప్పులను చేర్చి అనుమతులు పోందారన్న విషయాన్ని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. రూ.371 కోట్ల అవినీతి కూడా ఒక్క పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించినదే. రూ.371 కోట్ల అవినీతే కాకుండా మరో రూ.19 కోట్లు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణమంటూ వృథాగా ఖర్చు పెట్టారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఒరిజినల్ టెంటడర్ల ప్రకారం, కన్వెన్షన్ సిస్టం ప్రకారం నిర్మాణం చేపట్టకుండా దొడ్డిదారిలో టెండర్లను పిలిచి చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడిందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఇక పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తికాకుండానే ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం పనులు చేయడంపై కూడా కాగ్ నోట్ చేసింది. కుడికాలువ నిర్మాణంతో పాటు నీటిని రవాణ చేసేందుకు చిన్న కాలువల నిర్మాణం కూడా లేదని కాగ్ పేర్కోంది. ఇక ఈ ప్రాజెక్టు తగిన నీటి నిల్వ సామర్థ్యం లేదని, అందుచేత 24 పంపులు వున్నా కేవలం 11 పంపుల సాయంతోనే వరదలు వచ్చిన సమయంలో నీటిని తరలించారని కాగ్ తన నివేదికలో స్సష్టంగా పేర్కొంది.
ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం కోసం అసలు టెక్నాలజీతోపాటు ఆల్టర్నేట్ టెక్నాలజీ పేరుతో ఏకంగా 138 కోట్ల రూపాయలను అధికంగా ఖర్చుచేశారని కాగ్ తన నివేదకలో స్పష్టం చేసింది. మరికొన్ని నిధులను స్వాహా చేశారు. అందులో చంద్రబాబుతోపాటు ఏపీ మంత్రులంతా పాట్నర్లేనంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా అరోపించారు. 371 కోట్ల అవినీతి జరిగిన పట్టిసీమ ప్రాజెక్టుపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more