కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు మర్చిపోకముందే రోజుకో అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బుధవారం ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైకోర్టులో తనకు న్యాయం కావాలని అర్థిస్తూ పిటీషన్ వేయడానికి బాధితురాలు రావడంతో రెండు నెలల కిత్రం జరిగిన అత్యాచార.. పెద్ద మనిషిగా చెలమణీ అవుతున్న ఓ రేపిస్టు బాగోతం వెలుగులోకి వచ్చింది. తనపై అఘాయిత్యం జరిగిందని పోలీసులను అశ్రయించినా అమెకు న్యాయం జరగలేదు. అయితే రేపిస్టుతో రాజీకి రావాలని అమెను పోలీసులే బెదిరించారని బాధితురాలు అరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలి కాలంలో తన భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న సరిత అనే మహిళను స్థానికంగా పెద్దమనిషిగా చెలమణి అవుతున్న సుంకర ప్రతాప్ అనే వ్యక్తి లోబర్చుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోని సరిత తన మానన తాను జీవితాన్ని సాగదీస్తుంది. అయితే అమె బిడ్డను కిడ్నాప్ చేసిన ప్రతాప్.. అమెకు బిడ్డ కావాలంటే తన ఇంటికి రావాలని హుకం జారీ చేశాడు. దీంతో పెద్దమనిషి తన బిడ్డను ఎందుకని తీసుకెళ్లాడన్న అందోళనతో కంగారుగా వెళ్లింది సరిత.
దీంతో అమెను గదిలో నిర్భంధించి.. అపై అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ప్రతాప్. అత్యాచారానికి పాల్పడిన క్రమంలో అమె న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేసి మరీ అమెపై వరుసగా 20 రోజుల పాటు బలత్కారం చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై స్థానిక మంథని పోలిస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు కేసు నమోదు చేయాలని చేసిన ప్రయత్నాలకు పోలీసులు బ్రేకులు వేశారు. స్థానిక ఎస్.ఐ సహా ఏసీపీ కూడా నిందితుడైన సుంకర ప్రతాప్ కు వత్తాసు పలికారు. అంతేకాదు ప్రతాప్ తో రాజీ కుదుర్చుకోవాలని కూడా పోలీసుల నుంచి బెదిరింపులు వచ్చాయి.
ప్రతాప్ అమ్యామ్యాలకు తలొగ్గిన పోలీసులు తనకు న్యాయం చేయరని.. ఇక పెద్దమనిషిగా కొనసాగుతున్న వాడితో స్థానికంగా ఎదుర్కోలేనని భావించిన బాధితురాలు నేరుగా తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా.. పీవి నాగమణి అనే మహిళా అడ్వకేటుకు వివరాలను వ్యక్తపర్చారు. దీంతో అడ్వకేట్ అమెకు ధైర్యం చెప్పి.. ఈ కేసులో వివరాలన్నింటినీ సేకరించి.. న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. ఇలా కరీంనగర్ జిల్లా మంధనిలో రెండు నెలల క్రితం ఫిబ్రవరిలో జరిగిన అత్యాచార, కిడ్నాప్, నిర్భందం కేసులు వెలుగుచూశాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more