దేశాన్ని మొత్తం డిజిటిలైజేషన్ గా మారుస్తామని చెప్పిన కేంద్రం.. ఆ దిశగా నత్తనడకన సాగుతూ.. దేశ ప్రజలను మాత్రం కరెన్సీ కష్టాలను అలవాటు చేస్తోంది. ఎక్కడ ఎన్నికలు వుంటే అక్కడ కరెన్సీ కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్న కేంద్ర.. ఎన్నికలు దరిదాపుల్లో లేని రాష్ట్రాల్లో మాత్రం ప్రజలకు చుక్కలు చూపుతుంది. దీంతో ఇప్పుడు యావత్ దేశం క్యాష్.. క్యాష్ అంటూ గగ్గోలు పెడుతోంది. అసలు కరెన్సీ కట్టలకు ఏమైంది.. రెక్కలు వచ్చాయా..? ఎగిరిపోయాయా.? అంటూ దేశప్రజలు ఊసూరుమంటున్నారు.
2016 నవంబర్ పదోవ తేది తరువాత ఉత్పన్నమైన పరిస్థితులే ఉత్పన్నం అవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. బ్యాంకుల్లో నో క్యాష్.. ఏటీఎంకి వెళితే నో క్యాష్ బోర్డులు.. లేదా.. తాళాలు వెక్కిరించడం కనిపిస్తుండటంతో.. డబ్బు కోసం వెళ్తున్న కస్టమర్లకు చిరెత్తుకోస్తుంది. సర్లే ఒక్క ఏటీయమే కదా... అంటూ మరో ఏటీయం కేంద్రానికి వెళ్లినా అదే పరిస్థితి.. అవసరానికి డబ్బు అత్యవసరంగా కావాల్సి వచ్చినా.. డబ్బులు లేకపోవడంతో.. పరిస్థితులు అత్యంత దారుణంగా కనిపిస్తున్నాయని ఖాతాదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 80శాతం ఏటీయం కేంద్రాలల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పని చేసే ఏటీఎంల్లోనూ వందల మంది క్యూ కట్టి మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితులను ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలోని రాజ్ భవన్ ప్రాంతంలో.. ముఖ్యమంత్రి సహా పలువురు నివాసాలుంటే ప్రాంతంలోని ఏటీఎంల్లోనూ డబ్బు లేదు అనే బోర్డులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా స్పందించి.. 2వేల నోట్లు కనిపించటం లేదని అధికారులను వాకాబు చేశారు.
యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో 85శాతం ఏటీఎంలు 48 గంటలుగా పని చేయటం లేదు. ఎక్కడికి వెళ్లినా డబ్బు లేదు అనే మాట వినిపిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బును మాకిచ్చేందుకు బ్యాంకులకు ఏంటీ బాధ అంటూ అక్రోశం వెల్లగక్కుతున్నారు. దీనిపై RBI స్పందించింది. వరసగా వచ్చిన పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లతో నగదు కొరత ఏర్పడిందని.. మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించారు. అయితే మూడు రోజుల తరువాత మళ్లీ శనివారం.. అదివారం దీంతో మళ్లీ సోమవారం నాటికి పరిస్థితులు సాధారణంగా మారుతాయని బావిస్తున్నారు ప్రజలు. అయితే అర్బీఐ చెప్పినా.. బ్యాంకు ఏటీయం కేంద్రాల్లోకి డబ్బు వస్తుందా..? రాదా.?? అన్న సందేహాలు మాత్రం ఇంకా ఖాతాదారుల్లో నెలకొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more