నేపాల్ లోని భారత దౌత్య కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. బిరాట్నగర్ లోని భారత కన్సూలేట్ కార్యాలయం వద్ద బాంబు విస్పోటనం సంభవించడంతో స్థానికంగా కలకలం రేగింది. గతరాత్రి సంభవించిన ఈ విస్పోటనం అత్యల్పమోతాదుతో సంభవించిందని, దీని ధాటికి కార్యాలయం పశ్చమ బాగన వున్న ప్రహరీ గోడ స్వల్పంగా ధ్వంసమైనట్లు అక్కడి పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో కార్యాలయం వెనుకనున్న ఖాళీ స్థలంలో బాంబును అమర్చినట్లు స్థానిక ఎస్సీ అరుణ్ కుమార్ బిసి వెల్లడించింది. రాత్రి సమయంలో ఇద్దరు అగంతకులు బైక్ పై వచ్చి ఈ బాంబును అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ ముష్కరమూకల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ బాంబుదాడి నేపథ్యంలో పలు దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలను కూడా ఐఎస్ఐ ఉగ్రవాదులు టార్గెట్ చేసి వుంటారన్న అనుమానాలను కూడా నేపాల్ పోలీసులు వ్యక్తం చేశారు. కాగా, ఆయా కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికారులను కూడా నేపాల్ పోలీసులు సూచించినట్లు సమాచారం. అయితే నేపాల్ పోలీసుల సూచనల మేరకు వివిధ దేశాల దౌత్యవేత్తలకు అప్రమత్తంగా వుండాలని, కార్యాలయాల వద్ద సెక్యూరిటీని పెంచుకునే ఏర్పాటు చేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సమాచారం అందించినట్లు తెలుస్తుంది.
కాగా, నేపాల్ లోని భారత దౌత్యకార్యాలయం వున్న స్థానిక బిరాట్ నగర్ లో సోమవారం రోజున నేపాల్ లోని ఓ రాజకీయ పార్టీ కూడా బంద్ కు పిలుపునిచ్చిందని.. అయితే వారేమైనా ఈ అసాంఘిక కార్యానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో స్థానిక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బిరాట్ నగర్.. బీహార్ సరిహద్దుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, నేపాల్ ఎంబసీ వద్ద చిన్న పేలుడు జరిగిందని, ఆ సమయంలో కార్యాలయం ఎవరూ లేరని భారత అధికారులు తెలిపారు. నేపాల్ లో, ఉత్తర బీహార్ లో భారీ వరదలు వచ్చినప్పుడు తాత్కాలికంగా ఎంబసీ కార్యాలయం ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి అది కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more