తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో బాలికలు తమ హావాను కొనసాగించారు. రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి ఇవాళ ఉదయం ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 4,55,789 మంది విద్యార్థులు రాయగా.. 2,84,224 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. అలాగే ఇంటర్ సెకండియర్లో 4,29,378 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,88,772 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. కాగా... ఇంటర్ ఫస్టియర్లో 62.35శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఇంటర్ సెకండియర్లో 67.25శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.
ఇదిలా ఉండగా ఇంటర్ సెకండియర్ మేడ్చల్, కుమరంభీమ్ జిల్లాలు 85శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలువగా, రెండవ స్థానంలో 77శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ఉంది. చివరి స్థానంలో మహబూబాబాద్ జిల్లా(40శాతం) ఉంది. అలాగే ఇంటర్ ఫస్టియర్లో మేడ్చల్ జిల్లాకు తొలిస్థానం లభించగా రంగారెడ్డి జిల్లాకు రెండోస్థానం దక్కింది. మే 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఇంటర్ ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. రీకౌంటింగ్కు ఈనెల 20వరకు గడువు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఇంటర్ ఫలితాల కోసం ఈ కింద్రి లింకులను క్లిక్ చేయండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more