ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాజమహేంద్రవరంలోని షల్టన్ హోటల్లో మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. అత్యల్ప ఉత్తీర్ణత శాతంతో కడప జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. 77 శాతంతో నెల్లూరు జిల్లా రెండవ స్థానంలో, 76 శాతంతో మూడవ స్థానంలో గుంటూరు జిల్లా నిలువగా, 56శాతంతో కడప జిల్లా అఖరుస్థానంలో నిలిచింది.
సెకండియర్ ఫలితాల సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పరీక్షలు పూరైన కేవలం 24 రోజుల వ్యవధిలోనే పలితాలను రికార్డు సమయంలో విడుదల చేస్తున్నామన్నారు. విద్యార్థులు అందరూ తమ ఫలితాలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 44 వెబ్ సైట్లలో ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. అయితే ఇంటర్ ఫలితాలలో రోటిన్ మాదిరిగా బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. బైపీసీలో టాప్ మూడు ర్యాంకులను బాలికలే సాధించారని వివరించారు. మొత్తం 4,84,889 మంది విద్యార్థులు రాశారని, ఇందులో రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని అన్నారు.
ఈ ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణతా శాతం 73.33 శాతం నమోదు కాగా, బాలికలే ఈ సారి కూడా అధిక ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. ఎంపీసీ లో కూనం తేజవర్థన్ రెడ్డి 992 మార్కులతో స్టేట్ ఫస్ట్ గా నిలిచాడని మంత్రి వెల్లడించారు. ఇక రెండో స్థానంలో అఫ్రాన్ షేక్ నిలువగా, మూడో స్థానంలో వాయిలపల్లి సుష్మ నిలిచిందని మంత్రి ప్రకటించారు. బైపీసీలో ముక్కు దీక్షిత 990 మార్కులతో రాష్ట్రంలోనే ఫస్ట్ల్ ర్యాంకు సాధించిందని మంత్రి వెల్లడించారు. రెండో స్థానంలో రపనేని లక్ష్మీ కీర్తి నిలించిదన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఈనెల 21వ తేదీలోగా ఫీజు చెల్లించాలన్నారు. మే 14న పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more