Telangana budget: Rs 500 cr allocated for farmers' insurance రైతు లక్ష్మీ పథకానికి రూ.12వేల కోట్లు.. ఏప్రిల్ 19 నుంచి అమలు..

Telangana govt allocates rs 12000 cr for rythu lakshmi scheme

Telangana Government, Telangana budget, Etela Rajender, Telangana Budget 2018, telangana schemes, telangana irrigation projects, telangana new panchayat bill, telangana micro irrigation, shadi mikarak, kalyana Lakshmi schemes, double bedroom houses, land assingment to landless dalits, child welfare schemes, misson bhagiratha, mission kakatiya

Telangana Finance Minister Eatala Rajender has allocated Rs. 12,000 crore for the Rythu Lakshmi scheme that seeks to offer a financial help of Rs. 8,000 per year to each farmer.

రైతు లక్ష్మీ పథకానికి రూ.12వేల కోట్లు.. ఏప్రిల్ 19 నుంచి అమలు..

Posted: 03/15/2018 12:56 PM IST
Telangana govt allocates rs 12000 cr for rythu lakshmi scheme

తెలంగాణలోని తమ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని అర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పునరుద్ఘాటించారు. రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక పథకంగా పేరొందిన రైతు లక్ష్మీ పథకాన్ని కూడా ఏప్రీల్ 19 నుంచి అమలు చేస్తున్నామని ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా అన్నదాతలకు సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు.

ఈ పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రైతలకు ఏకరానికి రూ.8000 చోప్పున పంటల పెట్టుబడికి ముందు అర్థికసాయాన్ని అందిస్తుందని చెప్పారు. ఇందుకోసం ఈ వార్షిక బడ్జెట్ లో రూ.12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. దీంతో ఖరీఫ్, రబీ కాలానికి ముందు రైతన్నలకు ఇది అందుతుందని అన్నారు. అయితే ఈ మేరకు రైతులకు నేరుగా వారి పేర్లపై చెక్కులు అందుతాయని చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితీ అధ్వర్యంలో నిర్వహిస్తుందని, దీనికి గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మెన్ గా వ్యవహరిస్తారని ఈటెల చెప్పారు.

అయితే సన్నకారు, చిన్నకారు రైతులలో కూడా అనేక మంది తమ భూములను కౌలుకు ఇచ్చారని.. ఈ పథకంలో రైతులకు లాభం చేకూరుతుంది కానీ కౌలు రైతులకు మాత్రం ఏలాంటి ప్రయోజనం చూకూరదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం పథకాలను డిజైన్ చేసేప్పుడు భూములను సాగు చేస్తున్న వారి వివరాలను కూడా తీసుకుని వారికే నేరుగా సాయం అందేలా చేస్తే బాగుంటుందని రైతుసంఘాలు సూచిస్తున్నారు. ఇక కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకంలో భాగం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

* పంట పెట్టుబడి పథకానికి - రూ. 12వేల కోట్లు
* రైతు బీమా పథకానికి - రూ. 500 కోట్లు
* వ్యవసాయం, మార్కెటింగ్ కు - రూ. 15,780 కోట్లు
* పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కు - రూ. 120 కోట్లు
* వరంగల్ నగర అభివృద్ధికి - రూ. 300 కోట్లు
* పట్టణాభివృద్ధికి - రూ. 7,251 కోట్లు
* రోడ్లు భవనాల శాఖకు - రూ. 5,575 కోట్లు
* ఎస్సీ ప్రగతికి రూ.16,453కోట్లు
* ఎస్టీ ప్రగతి నిధికి రూ.9,693కోట్లు
* సాంస్కృతిక శాఖకు రూ.58కోట్లు
* దళితులకు మూడెకరాల భూ పంపిణీకి రూ.1,469కోట్లు
* ఎస్టీల సంక్షేమానికి రూ.8,063కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.5,920కోట్లు
* ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Government  budget  Etela Rajender  Telangana Budget 2018  telangana schemes  KCR  KTR  TRS  

Other Articles