తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత గత రెండేళ్లుగా అభివృద్దిలో శరవేగంగా దూసుకుపోతుందని అర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్దితో పాటు పేద, బలహీన వర్గాల అభివృద్దికి కట్టుబడి వుందని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బడ్జెట్ కాబట్టి.. ఈ బడ్జెట్ లో అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సారి తమ బడ్జెట్ ప్రజాకర్షకంగా వుంటుందని ధీమా వ్యక్తం చేసిన ఈటెల.. వరుసగా ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం సంతోషంగా వుందని అన్నారు.
అణాగారిన తెలంగాణ వాసులను అభ్యున్నతి వైపు నడింపించే దిశగా తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని, ఇందుకు రాష్ట్రంలో పెరిగిన రొండెంకెల జీడీపీయే నిదర్శనమి చెప్పారు. 2013-14లో సమైక్య రాష్ట్రంలో కేవలం 5.4గా వున్న జీడీజీ.. ఈ ఏడాది 10.4 శాతంగా వుంటుందని అశాభావం వ్యక్తం చేశారు. నూతన పారిశ్రామిక విధానంతో తయారీ రంగంలో కూడా వృద్దిని సాధించామని అన్నారు. ఇక విభజించిన రాష్ట్రంలో అంధకారమే అని నోళ్లు మూతపడేలా విద్యుత్ రంగంలో శరవేగంగా అభివృద్ది చెందామని, వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫారాతో సాగు విస్తీర్ణం పెరిగిందని ఈటెల పేర్కోన్నారు.
ఈ క్రమంలో్ ఈ వార్షిక బడ్జెట్ మొత్తం రూ. రూ.1,74,453కోట్లుతో ప్రవేశపెట్టిన ఈటెల.. రెవన్యూ వ్యయం రూ.1,25,454 కోట్లు వుందన్నారు. రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లుగా వుండగా, ద్రవ్యలోటు మాత్రం రూ.29,077 కోట్లుగా అంచనా వేశామని చెప్పారు. అయితే జీడీపిలో ద్రవ్య లోటు 3.45శాతంగా వుందని చెప్పారు. అయితే తయారీ రంగం, పారిశ్రామిక రంగం, సాగు విస్తీర్ణం, మాంసం ఎగుమతి నేపథ్యంలో రాష్ట్ర అధాయం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అదాయం రూ.73,751కోట్లుగా వుందని, అయితే తలసరి అదాయం కూడా లక్షా 75 వేలకు పెరిగిందని ఈటెల పేర్పోన్నారు.
* తెలంగాణ మొత్తం బడ్జెట్.. రూ.1,74,453కోట్లు
* రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు
* ద్రవ్యలోటు అంచనా.. రూ.29,077కోట్లు
* జీడీపీలో ద్రవ్య లోటు 3.45శాతం
* రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు
* కేంద్రం వాటా రూ.29,041కోట్లు
కేటాయింపులు ఇలా..
* పంటల పెట్టుబడి మద్దతుకు రూ.12వేల కోట్లు
* రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు
* వ్యవసాయ యంత్రీకరణకు రూ.522కోట్లు
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.15,563కోట్లు
* బిందు తుంపర సేంద్యానికి రూ.127కోట్లు
* నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు
* రెండు పడకగదుల ఇళ్లకు రూ.2,643కోట్లు
* గురుకులాలకు రూ.2,283కోట్లు
* ఆర్ అండ్ బీకి రూ.5,575కోట్లు
* అర్చకుల జీతభత్యాలకు - రూ. 72 కోట్లు
* హోంశాఖకు - రూ. 5,790 కోట్లు
* పౌరసరఫరాల రంగానికి - రూ. 2,946 కోట్లు
* చేనేత, జౌళి రంగానికి రూ.1200 కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.1,286కోట్లు
* విద్యుత్ రంగానికి రూ.5,650కోట్లు
* ఐటీ శాఖకు రూ.289కోట్లు
* పురపాలక శాఖకు రూ.7,251కోట్లు
* గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1500కోట్లు
* పట్టణాభివృద్ధికి రూ.1000కోట్లు
* యాదాద్రి అభివృద్ధికి రూ.250కోట్లు
* వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు
* భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు
* బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ.50కోట్ల చొప్పున కేటాయింపు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more