ఏదైనా ఓ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరయితే.. సందెట్లో సడేమీయాల జోరుకు ఏమాత్రం కొదవ వుండదు. అది ఇన్నాళ్లు. మారుతున్న కాలంతో పాటు యువతలో పెరుగుతున్న చెడు ప్రవర్తనలు కూడా ఇప్పడు ప్రశ్నార్థకంగా మారాయి. సెలబ్రిటీలు హాజరయ్యే కార్యక్రమంలో సడేమియాలు తగ్గి కామాంధుల సంఖ్య పెరుగుతుంది. మరీ ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలు వచ్చే కార్యక్రమాల్లో కామాంధుల హల్ చల్ అంతాఇంతా కాదు. అవకాశం దొరికితే వారే సెలబ్రిటీలపై బహిరంగ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం ముమ్మాటికీ నిజం.
ఇప్పటికే ఇలాంటి అనుభవాలను ఎందరో మహిళ సెలబ్రిటీలు ఎదుర్కోన్నారు. అయితే కొందరు తమకు జరిగిన వేధింపులపై ధైర్యంగా చెప్పగా, మరికోందరు మాత్రం మిన్నకుండిపోతున్నారు. తాజాగా, చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న గాయని చిన్మాయి శ్రీపాద కూడా ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొంది. సభ్య సమాజంలో తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, అడవారి మధ్యనే తిరిగే మగాడు.. ఎందుకు మృగాడిలా మారుతున్నాడని అమె ప్రశ్నించారు. తనకు ఎదురైన షాకింగ్ ఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరించింది.
చిన్మయి సోషల్ మీడియాలో పోస్టు చేసిన అమె వ్యధ.. అమె మాట్లల్లోనే.. `ఇటీవల ఓ ఈవెంట్కు హాజరయ్యా. అక్కడ నా చుట్టూ చాలా మంది చేరారు. ఆ గుంపులోని ఓ వ్యక్తి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన చేతితో నా లైంగిక అవయవాలను తాకాడు` అని ఇన్ స్టాగ్రామ్ లో రాసింది. దీంతో పాటు అమె బాలబాలికలు ఎదురయ్యే లైంగిక వేధింపులపై కూడా వరుసగా సందేశాలను పెట్టింది. ఉపాధ్యాయలు, సోదరులు, అంకుల్స్, ఆంటీలు, సహ ప్రయాణీకులు.. ఇలా అందరి చేతుల్లో బాలబాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది. ఈ విషయంలో బాలికల మాటలను కొందరు నమ్ముతారు.. కానీ బాలుర మాటలను ఎవరూ నమ్మరని కూడా అభిప్రాయపడింది. అయితే బాలబాలికలు తమపై జరగుతున్న లైంగిక దాడులను ఎంజాయ్ చేస్తారని కొంతమంది పెద్దలు చెబుతుండడం సిగ్గుచేటు అని చిన్మయి పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more