వీకెండ్ లో స్నేహితులతో కలసి పర్వత రోహణ చేసేందుకు వెళ్లిన విద్యార్థుల బృందంలో పెను విషాదం అలుముకుంది. తమిళనాడులోని తేని జిల్లా కురంగణి ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణ కోసం విద్యార్థుల బృందంలోని ఐదుగురిని కార్చిచ్చు బలితీసుకుంది. అప్పటి వరకు ఎంతో అహ్లాదంగా, అనందంగా గడిపిన విద్యార్థులను అకస్మాత్తుంగా కార్చిచ్చు చుట్టుముట్టే సరికి.. ఒక్కసారిగా హాహాకారాలు అకాశానంటాయి. మంటలను గమనించిన విద్యార్థులు పలువురు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా, మరికోందరు ఘటనపై స్థానిక అధికారులు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన రెస్కూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో 15 మంది విద్యార్థులను రక్షించింది. కాగా శరవేగంగా వ్యాపించిన మంటలకు ఐదుగురు విద్యార్థినులు అగ్నికి ఆహుతయ్యారు. మున్నార్ ప్రాంతంలోని సూర్యనెల్లికి చెందిన 37 మంది విద్యార్థినులు రెండు బృందాలుగా తేని జిల్లా కురంగణి అటవీ ప్రాంతంలో పర్వతరోహణకు వచ్చారు. వారు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కార్చిచ్చు రేగడంతో వారంతా మంటల్లో చిక్కుకున్నారు. కాగా, ఈ ప్రాంతంలో వెలుతురు తక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడినట్టు మదురై సర్కిల్ కన్జర్వేటర్ ఆర్కే జగేనియా తెలిపారు.
మంటలు వేగంగా నలువైపులా వ్యాపిస్తుండడంతో అటవీ సిబ్బంది, సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వారు తిరిగి బోధి చేరుకుని చెన్నైకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా అంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ట్రెక్కింగ్ ప్రారంభం కాగా శనివారం కేరళవైపు అడవుల్లోకి చేరుకున్నారు. ఆదివారం కురంగణి నుంచి విద్యార్థులు ట్రెక్కింగ్ ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more