టెలికం కంపెనీల మధ్య విపరీతమైన కాంపిటీషన్ వచ్చేసింది. రిలయన్స్ జియో వచ్చే వరకు అన్ని టెలికాం సంస్థలు రమారమి ఒకే ధరతో పేదల జేబులను కొల్లగొట్టగా, జియో అగమనంతో టెలికాం సంస్థల మధ్య ధరల పోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాక్సిమ్ పేరుతో అత్యంత చౌకగా ఏడాది వ్యాలిడిటీతో కేవలం రూ.999కే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన భారతి ఎయిర్ టెల్ నెలవారి వ్యాలిడిటీతో అత్యంత చౌకధరలో మరో పథకాన్ని ప్రవేశపెట్టి జియో కస్టమర్లను కూడా అకర్షించింది. ఇక ఎంట్రీ లెవల్ వ్యాలిడిటీని కూడా రూ.9కే అందిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో ఇక తాము కూడా పోటీ ప్రపంచంలో వున్నమంటూ చౌకధర అపర్ ను ప్రకటించింది ఐడియా. రమారమి ఎయిట్ టెల్ ప్లాన్ 28 రోజుల ప్లాన్ ధరలోనే ఈ ఆపర్ వున్నా.. దీని వ్యాలిడిటీ మాత్రం కేవలం 14 రోజులకే పరమితం చేసింది. అంటే 14 రోజుల వ్యాలిడిటీ వున్న రూ.109 ప్లాన్ ను తీసుకువచ్చింది, ఈ పథకాన్ని ప్రకారం.. అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ తో పాటు 14 రోజుల పాటు రోజూ 1జీబీ 4జీ/3జీ డేటాను, 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. ఇక రోజుకు 250 నిమిషాలు మాత్రమే ఉచితమని ఈ పరిమితి దాటితే ప్రతీ సెకనుకు ఒక పైసా చార్జీ పడుతుందని తెలిపింది.
ఎంపిక చేసిన సర్కిళ్లలో యూజర్లు ఐడియా వెబ్ సైట్, మై ఐడియా యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుని ఈ ప్రయోజనాలు పొందొచ్చు. ఎయిర్ టెల్ ఇటీవలే రూ.93 ప్లాన్ ను ప్రకటించింది. ఇందులో 28 రోజుల వరకు అపరిమిత కాలింగ్ తోపాటు 1జీబీ డేటా సదుపాయం ఉంది. ఇదే ధరకు జియో 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ అవకాశం కల్పిస్తోంది. ఈ దృష్ట్యా పోటీ కంపెనీలతో పోలిస్తే ఐడియా ప్లాన్ ఏ మాత్రం ఆకర్షణీయంగా కనిపించడం లేదని పలువురు స్మార్ట్ ఫోన్ ప్రియులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more