విశ్వవిఖ్యాత నటుడు కమలహాసన్ రాజకీయ అరంగేట్రానికి ముహూర్తం ఖారరైంది. గత కొంత కాలంలో రాష్ట్ర రాజకీయాలలో నెలకొన్న స్థబ్దత కారణంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చేప్పిన కమలహాసన్ బుధవారం రోజున తన పార్టీని లాంఛనంగా అవిష్కరించనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ స్టెటస్ కోను సహించలేక, ప్రజలకు చేకూరాల్సిన లబ్ది చేకూర్చే దిశగానే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. మధురైలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో కమలహాసన్ తన పార్టీ పేరు, జెండాను, పార్టీ విధానాలను వెల్లడించనున్నారు.
ఇందులో భాగంగా ఆయన తన పార్టీ అవిష్కరణకు ముందుగానే రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ప్రారంభం కానున్న ఆయన పర్యటనలో ముందుగా ఆయన తన జన్మభూమి. సొంతగ్రామమైన రామనాథపురం చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆయన దుండిగల్, శివగంగ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తరువాత మధురై సభా వేదికకు సాయంత్రం ఆరు గంటలకు చేరకోనున్నారు. కాగా, ఈ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా హజరుకానున్నారు. తాజాగా జరిగిన ఆయన సీఎస్ పై దాడి నేపథ్యంలో ఆయన ఏలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.
కాగా, కమల్ అహ్వానం నేపథ్యంలో రావాల్సి వున్నా.. అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నానని చెప్పిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తన వీడియో సందేశాన్ని మాత్రం పంపుతున్నట్లు ఆయన అధికార కార్యాలయవర్గాలు వెల్లడించాయి. ఇక కమల్ అహ్వానం అందినప్పటికీ ఈ విషయమై ఇంకా ఎలాంటి స్పందనను వెలువరించలేదు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఇదిలావుండగా, ప్రజల సమస్యలను, ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే తాను రాష్ట్ర పర్యటనను చేస్తున్నట్లు కమల్ హాసన్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more