జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఆంద్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం విషయంలో నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసి ఇవాళ తొలిసారిగా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాను పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయమేనని అన్నారు ఈ సమావేశంలో పాల్గోన్నవారికి ఉన్నంత జ్ఞానం, సబ్జెక్ట్ గానీ తనకు లేవని అన్నారు. అయితే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల చలించే హృదయం ఉందని అన్నారు. తప్పు జరుగుతున్నప్పుడు దాని మూలంలోకి వెళ్లలేను కానీ, దాన్ని ఎందుకు సరిచేయరని అడగాలని తన గొంతు లేస్తుందని అన్నారు.
అందరూ రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతున్నారు కానీ, వాస్తవాలను సరిగా చెప్పడం లేదన్న అభిప్రాయం తనలో కలిగిందని అన్నారు. మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు గాంధీనగర్ లో ఆయనను కలిశా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేశం తనకు భద్రత కల్పిస్తుందనే నమ్మకంతో ప్రజలు బతుకుతారని అన్నారు. అయితే రాష్ట్ర విభజన చేసినప్పుడు ఓ పద్ధతి, పాడూ లేకుండా మరో రాష్ట్ర ప్రజలను వెళ్లిపోండి అన్నారు. ఇక్కడ ప్రజల ప్రమేయం అస్సల్లేదని అన్నారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు.
తన ఫామ్ హౌజ్ లో పనిచేస్తున్న ఓ కుటుంబం 50ఏళ్ల కిందటే ఇక్కడికి వచ్చిందని.. వారిక కుటుంబంలోని వ్యక్తి చనిపోగా.. మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకెళ్తే ‘నువ్వు ఆంధ్రా వాడివి. ఇక్కడ పూడ్చడానికి వీళ్లేదు’ అని అన్నారు. వాళ్లకు ఏం చేయాలో తోచలేదు. తనకు తెలిసిన స్నేహితుల ద్వారా వాళ్లకు చెప్పించి అంత్యక్రియలు చేయించాను. ఇలాంటి సమస్య ప్రతీ బస్తీలో ఉంటుందని అన్నారు. పాలకులు చేసిన తప్పులకు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నాని అన్నారు. ఈ పరిణామాలు దైనందికంగా పనులు చేసుకునివారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తున్నాయని అన్నారు.
‘‘రాష్ట్రం విడిపోయిన తర్వాత అంధ్రాకు చెందిన చాలా మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఉండిపోయారని, అయితే ‘ఏరా రాష్ట్రం వచ్చినా మీ రాష్ట్రానికి పోలేదా?’ అని ఎవరైనా నిలదీస్తారేమోనని తాము నిత్యం భయపడుతున్నామని వారు తనతో చెప్పారని అన్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా మారిందని అన్నారు. దీంతో అంధ్రరాష్ట్ర పౌరులలో అగ్రహర రగిలిపోయిందని అన్నారు. తాము దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులమా.. మేము వాళ్ల మాదిరిగా దేశానికి పన్నులు చేల్లించడం లేదా..? అన్నప్రశ్నలు ఎదురవుతున్నాయని అన్నారు.
ఆక్వా ఫుడ్ పార్క్ సమస్య ఉత్పన్నమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడి యువతను పట్టించుకోలేదని అన్నారు. అయితే తాను అక్కడికి వెళ్లినప్పుడు అక్కడి యువత తనతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మా మాట వినడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఏదో ఒకసారి వినేసి వెళ్లిపోతారు‘ మాకు అతివాదం శరణ్యమా అన్న భావన కలుగుతుందని వారు అవేదన వ్యక్తం చేశారని అన్నారు. అలాంటిది.. బాధ్యతతో వ్యవహరించాల్సిన కేంద్రం ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే వచ్చే పరిణామాలు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు.
కేంద్రం మాట తప్పితే దాని ప్రభావం రాబోయే తరాలపై ఖచ్చితంగా పడుతుందని, అది ఎటు దారితీస్తుందో తెలియదని జనసేనాని అందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సమగ్రతకు కూడా భంగం కలిగించవచ్చునని.. దీని వల్ల అతివాదం, తీవ్రవాదాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే దేశంలో ఉత్తరాది, దక్షిణాది పౌరులమంటూ వీడిపోవాల్సి వస్తుందని, దీనికి యువత అతివాదం తోడైతే వేర్పాటు వాదానికి బలమైన వాతావరణం ఏర్పడుతుందని ఇది దేశ భద్రతకే సవాలు అని పవన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more