అంతర్జాతీయంగా ఉగ్రవాద స్వర్గధామ దేశంగా అపకీర్తిని మూటగట్టుకుంటున్న పాకిస్తాన్.. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఎట్టకేలకు భారతదేశ అర్థిక రాజధాని ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉల్ దవా అధినేత హఫీజ్ సయీద్ ను ఉగ్రవాదిగా గుర్తించింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై పెరిగిన ఒత్తిడి నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హఫీజ్ సయ్యీద్ ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే దీనిని అప్పట్లో పాకిస్థాన్ అంగీకరించకలేదు. అంతేకాదు అతనిపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని పాకిస్థాన్ న్యాయస్థానాలు కూడా తేల్చిచెప్పాయి.
కాగా, అగ్రరాజ్య, ఐక్యరాజ్య సమితిలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిన క్రమంలో తాజాగా పాకిస్థాన్ హఫీజ్ సయ్యీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. జమాత్ ఉల్ దవా కార్యాలయాల ముందున్న బారికేడ్లను తొలగించిన తర్వాత పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద సంస్థలుగా పేర్కొని నిషేధం విధించిన లష్కరే తోయిబా, జమాత్ ఉల్ దవా, హర్కత్ ఉల్ ముజాహిదీన్ తదితర సంస్థలను 1997లో సవరించిన ఉగ్రవాద వ్యతిరేక చట్టం పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్పై పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ సంతకం చేశారు.
మొత్తం 27 నిషేధిత ఉగ్రవాద సంస్థలను ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ వెంటనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆస్తులను వెంటనే నిలిపివేయనున్నారు. ఇదిలా ఉండగా.. జమాత్ ఉల్ దవా కార్యాలయాల ముందు ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించారు. భద్రతా కారణాల దృష్ట్యా దశాబ్దం కిందట ఈ బారికేడ్లను ఏర్పాటు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జమాత్ ఉల్ దవా ప్రధాన కార్యాలయం సహా 26 ప్రాంతాల్లోని బారికేడ్లను తొలగించినట్లు లాహోర్ డీఐజీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more