వ్యాకరణ తప్పిదాలు ఒక్కోసారి మంచి చేస్తే మరోమారు పదిమందిలో తలదించుకునేలా చేస్తాయి. తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) చేసిన ట్వీట్ ఇదే తప్పిదంతో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ ట్వీట్ను చూసిన నెటిజన్లు పీఎంఓపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశ ప్రధానమంత్రి కూడా ఇలాంటి హామీని తమ మానిఫెస్టోలో పెట్టరని ఏకంగా నెట్ జనులు సూచిస్తున్నారు. ఇక మరికొందరు నిజం ఎన్నటికీ దాగదని కూడా తేల్చిచెబుతున్నారు. ఏకంగా వైద్యులు కూడా ప్రధాని ట్విట్ కు ఇది నిజమేనా..? అంటూ అశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన ప్రసంగం నుంచి ఓ అంశాన్ని తీసుకున్న ఆయన కార్యాలయం దానిని ట్విట్టర్లో పోస్టు చేసింది. అయితే ఈ క్రమంలో కామా పెట్టాల్సిన చోట ఆ విషయాన్ని మర్చిపోవడంతో దాని అర్థం పూర్తిగా మారిపోయింది. దీంతో అది చదివినవారు విస్తుపోయారు. అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొందరు తప్పు జరిగింది చూసుకోమ్మని సూచించగా, కొందరు మాత్రం ట్రాల్ చేశారు. దీంతో ఈ ట్విట్ ను హ్యాండిల్ చేసిన ఉద్యోగికి వెనువెంటనే ప్రధాని కార్యాలయం ఊస్టింగ్ అర్డర్లను కూడా జారి చేసిందని సమాచారం.
ఇంతకీ ట్విట్ సారాంశమేమిటంటే.. ‘‘మనమంతా కలిసి నాసిరకమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కృషి చేద్దాం’’ అని ప్రధాని అన్నట్టు ట్వీట్ చేసింది. నిజానికి మోదీ ఉద్దేశం అదికాదు. ‘‘పేదలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు మనమంతా కృషి చేద్దాం’’ అన్నది అసలు ఉద్దేశం. అయితే ‘పూర్’ తర్వాత ‘కామ’(,) పెట్టడం మర్చిపోవడంతో దాని అర్థం పూర్తిగా మారిపోయింది. ఈ ట్వీట్ను చదివిన వారు తొలుత కంగారు పడ్డారు. తర్వాత ‘కామా’ మర్చిపోయిన విషయాన్ని గుర్తించి నవ్వుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more