కార్పోరేట్ అసుపత్రులు తమ చేతివాటం ప్రదర్శించి ప్రజల ప్రాణాలతో చెటగాలమాడుతున్న క్రమంలో వాటిపై జాతీయస్థాయిలో ఏదైనా కొత్త సవరణలు తీసుకువస్తారని అశించిన ప్రజలకు నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్.. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను కనబరుస్తున్నామని చెప్పింది. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల అరోగ్యభీమా పథకాన్ని కల్పిస్తామని చెప్పిన కేంద్రమంత్రి జైట్లీ, ఈ పథకంతో దేశంలోని పది కోట్ల కుటుంబాలకు లభ్ది చేకూరనుందని కూడా చెప్పారు. ప్రపంచంలోనే ప్రభుత్వ అధ్వర్యంలో చేపట్టే అతిపెద్ద అరోగ్యపథకంగా ఈ పథకం గుర్తింపుకు కూడా సాధిస్తుందని మంత్రి అశాభావం వ్యక్తం చేశారు.
ఆయుష్మాన్ భవ సహా పలు ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలను పరిపుష్టం చేస్తామని చెప్పారు. ఆరోగ్య రక్షణ పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, కానీ కావాల్సిన స్థాయిలో ఆరోగ్య సంరక్షణ అందించాలని తాము కోరుకుంటున్నట్టు జైట్లీ చెప్పారు. అంతేకాక 1.5 లక్షల ఆరోగ్య సంరక్షణ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు కూడా చెప్పారు. ఇవి ప్రతి ఒక్క గృహదారుడికి దగ్గరగా ఉంటాయని, ఈ సెంటర్లు ప్రజలకు అవసరమైన డ్రగ్స్ను, డయాగ్నోసిస్ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు హెల్త్ కవర్ అందుబాటులో ఉండే పథకం కెనడా దేశంలో అవలంభవుతోంది.
ప్రస్తుతం మనదేశం కూడా ప్రజలకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిర్ణయించింది. మెడికల్ ఇన్సూరెన్స్తో పాటు కొత్తగా 24 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత కాలేజీలను కూడా ఆధునీకరించనున్నట్టు తెలిపారు. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చూసుకోనున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై కూడా ఈ సారి ప్రభుత్వం ఈసారి ఎక్కువగా దృష్టిసారించినట్టు తెలిసింది.
వైద్య, విద్యా రంగాలలో ముఖ్యాంశాలివే..
* టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి
* ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా అభివృద్ధి
* కొత్తగా 24 మెడికల్ కాలేజీలకు అనుమతి
* ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు
* టీబీ రోగులకు వైద్యం సమయంలో నెలకు రూ.500
* ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్ స్కీం (ఆయుష్మాన్ భవ పథకం). రూ.330 చెల్లిస్తే కుటుంబానికి బీమా
* ఆయుష్మాన్ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం
* ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల మందికి లబ్ధి
* ఆరోగ్య రంగానికి భారీగా నిధులు. రూ.లక్షా 38 వేల కోట్ల నిధులు కేటాయింపు
విద్య
* కొత్తగా 18 ఆర్కిటెక్చర్ కాలేజీలు
* స్కూల్ టీచర్ల శిక్షణకు ప్రత్యేక స్కూళ్లు
* డిజిటల్ విద్యావిధానానికి మరింత చేయూత
* విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో రైజ్ నిధి
* విద్యాభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రణాళిక
* నవోదయ పాఠశాలల తరహాలో కొత్తగా ఏకలవ్య పాఠశాలలు
* ఈ ఏడాది నుంచి పీఆర్ఎఫ్(ప్రధానమంత్రి రిసెర్చ్ ఫెలోషిప్). టాప్ వెయ్యి మంది బీటెక్ విద్యార్థులు
* నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి మేం పనిచేయనున్నాం.
* గ్రూప్ సీ, డీలలో ఇంటర్వ్యూలను రద్దు చేశాం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more