తెలంగాణలోని కొండగట్టు అంజనేయ స్వామి అలయానికి చేరుకున్న జనసేన అదినేత పవన్ కల్యాన్ అంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాన్ రాక సందర్భంగా ఆయనకు అర్చకులు ఆలయ సంప్రదాయాలతో ఆలయంలోకి అహ్వానించారు. ఆంజనేయ స్వామి అభయం వల్లే తాను 2009 ఎన్నికల తరుణంలో జరిగిన పెను ప్రమాదం నుంచి తాను బతికి బయటపడ్డానని ఇటీవలే చెప్పిన పవన్.. తనను, తన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అంజనేయ స్వామి చల్లగా కాపాడాలని కోరుకున్నట్లు చెప్పారు.
ఆలయ అర్చకులు పవన్ కల్యాన్ ను అశీర్వదించి ప్రసాదాలను అందించారు. అలయ అభివృద్ది కోసం తాను శాయశక్తులా కృషి చేస్తానని చెప్పిన పవన్ కల్యాన్.. తన వంతుగా రూ.11 లక్షల రూపాయలను స్వామివారి అలయానికి విరాళంగా సమర్పించారు. ఇక అలయం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వున్న కరీంనగర్ కు పవన్ మరో అరగంట వ్యవధిలో చేరుకోనున్నారు. అక్కడకు చేరుకున్న అనంతరం మీడియాతో పవన్ తన యాత్ర విశేషాలను చెప్పనున్నారు.
అభిమానుల అత్యుత్సాహం..
తమ అభిమాన నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొండగట్టు ఆలయానికి చేరుకున్న నేపథ్యంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ కారుపైకి ఎక్కిన ఇద్దరు యువకులు పవన్ వైపునకు చూస్తూ చేతులు ఊపే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతమంతా పవన్ కల్యాణ్ కి అనుకూల నినాదాలలో హోరెత్తిపోయింది. అభిమానులను పోలీసులు అదుపు చేశారు. అంజన్నను సందర్శించుకున్న తరువాత పవన్ కల్యాణ్ కరీంనగర్కు వెళ్లనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more