దేశ ప్రజల ముంగిట్లోకి పాస్ పోర్టులను అత్యంత వేగంగా తీసుకువెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. అందులో భాగంగానే తమ శాఖ కూడా వేగిరంగా సేవలను అందిస్తుందని అన్నారు. గతంలో కంటే క్రిందటేడాది తమ ప్రభుత్వం 19 శాతం మేర అధికంగా దేశ ప్రజలకు పాస్ పోర్టులను అందించగలిగిందని అన్నారు.
భవిష్యత్తులో వీలైనంత త్వరగా పాస్ పోర్టును అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 236 పొష్టాఫీసు పాస్ ఫోర్టు కేంద్రాలను తెరవాలని కూడా తమ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటికే 60కి పైగా పోస్టాఫీసు పాస్ పోర్టు కేంద్రాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగతా వాటిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పాస్ పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న పద్ధతిని మరింత సులభతరం చేయాలని చూస్తున్నామన్నారు.
పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి, మంత్రులు హాజరైన వేదికపై పోస్టాఫీసులో పాస్ పోర్టు కేంద్రాన్ని (పీవోపీఎస్కే) అమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎనిమిదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు పాస్ పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలో 10శాతం రాయితీ కల్పించనున్నామన్నారు. ఈ పీవోపీఎస్కే కేంద్రాల ద్వారా పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు పాస్ ఫోర్టు సేవలు పొందుతాయని ఆమె చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more