దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమౌతున్న క్రమంలో వాటిని అరికట్టేందుకు తొలివిడతగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందుగా రోడ్డు రావాణ మార్గంలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం చర్యలను చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2018లోగా అన్ని ప్రజారవాణా వాహనాలు, ట్యాక్సీలు, బస్సుల్లో జీపీఎస్ పరికరాలు, పానిక్ బటన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా శాఖ అన్ని రాష్ట్రాలకు అదేశాలను జారీ చేసింది.
ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ ఓ ట్వీట్ ద్వారా విషయాన్ని వెల్లడించింది. వాహనాల్లో మహిళలపై లైంగిక దాడులు జరగకుండా ప్రజా భద్రతను పెంచేందుకు రవాణా శాఖ యోచిస్తోంది. గతంలో ఈ నిబంధనలు తీసుకువచ్చినప్పటికీ... కొన్ని రాష్ట్రాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీపీఎస్, పానిక్ బటన్ ఏర్పాటు చేయడానికి ఇదే తుది గడువని, మళ్లీ పొడిగించబోయేది లేదని స్పష్టం చేసింది.
బస్సులు, ట్యాక్సీల్లో జీపీఎస్, పానిక్ బటన్ ఉండటం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. అయితే మూడు చక్రాల వాహనాలు, ఈ-రిక్షాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ జీపీఎస్, పానిక్ బటన్.. రవాణా శాఖ, పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించి ఉంటాయి. ఆపదలో ఉన్న ప్రయాణికులు పానిక్ బటన్ను నొక్కగానే విషయం పోలీసులకు, రవాణాశాఖకు చేరుతుంది.
From 1st April, 2018, the passenger transport vehicles including taxis and buses are to be mandatorily equipped with GPS devices.@nitin_gadkari @PMOIndia @transform_ind #TransformingIndia
— MORTHINDIA (@MORTHIndia) January 17, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more